కర్ణాటకలో ఎన్నికల సమరానికి తెర పడుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్, బీజేపీ ఫుల్ ఫోకస్ తెలంగాణ పైనే ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక, తెలంగాణ మీద కమలం ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో ఈ నెల 10న పోలింగ్ ఉంది. 13న ఫలితాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కర్ణాటక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలని బిజేపీ నిర్ణయించుకుంది. కర్ణాటక బార్డర్ లో ఎన్నికల సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. దీంతో ఆయా పార్టీల హేమాహేమీలు తెలంగాణను వరుసగా పర్యటించడానికి షెడ్యూల్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకుమునుపు ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభకు వస్తున్నారు. మరో వైపు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండడంతో మర్నాడే తెలంగాణకు మోడీ వస్తున్నట్టు సమాచారం. వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ఆయన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ రెండు పార్టీలు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడ్డాయి.
కర్ణాటకలో ఎన్నికల సమరానికి తెర పడుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్, బీజేపీ ఫుల్ ఫోకస్ తెలంగాణ పైనే ఉంది. దీంతో ఆయా పార్టీల హేమాహేమీలు తెలంగాణను వరుసగా పర్యటించడానికి షెడ్యూల్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకు మునుపే ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభకు రానున్నారు. మరో వైపు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండడంతో మర్నాడే తెలంగాణకు మోడీ వస్తున్నట్టు సమాచారం. వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ఆయన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ రెండు పార్టీలు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడ్డాయి.
ఇక దక్షిణాదిలో ఖాతా ఓపెన్ చేయడానికి చాలా కాలం నుంచి ఉవ్విలూరుతున్న కమలం పార్టీ కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని శత ప్రయత్నాలు చేస్తోంది. అది కాని సాధ్య పడితే..దాని ప్రభావం తప్పని సరిగా తెలంగాణపై ఉంటుందని భావిస్తోంది. దీని కోసం ఏ అవకాశాన్ని వదులుకోవద్దన్న వ్యూహంతో సరిహద్దుల్లో సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల కోడ్ సమస్య లేకుండా జహీరాబాద్, నారాయణ పేట లేదా మరెక్కడైనా సభను నిర్వహించే అవకాశముందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరో వైపు తెలంగాణలో పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి అనేక వ్యూహాలతో బీజేపీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం పై ఎటాక్ చేయడంతో పాటు కేంద్రమంత్రులు, ముఖ్యనేతల పర్యటనల ద్వారా పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ ను నింపాలని స్కెచ్ వేసింది. దాంతో పాటు రాష్ట్రానికి వివిధ రంగాల అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న పథకాల గురించి కూడా ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలో తీసుకొని వెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-focus-in-telangana--25-154951.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.