సంప్రదాయలతో కూడిన బీచ్ పార్టీ.. నవంబర్ 9,10 తేదీల్లో భీమిలి ఉత్సవాలు

Publish Date:Nov 9, 2019

Advertisement

 

విశాఖపట్టణం అంటే అందరికీ తెలిసిందే. మరి భీమునిపట్టణం అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అదే ఇప్పుడు భీమిలిగా పిలవబడే అప్పటి భీమునిపట్నం. విశాఖ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అద్భుత పర్యాటక ప్రాంతాల్లో భీమిలి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. విశాఖకు పేరు ప్రఖ్యాతలు రాక ముందే ఓ పెద్ద పట్టణంగా చారిత్రక ప్రాంతంగా విలసిల్లింది భీమిలి. ఈ పట్టణం రానురాను కాస్త మరుగున పడింది కానీ ఇప్పటికీ అక్కడ చూడతగ్గ.. ఆస్వాదించదగ్గ.. విశేషాలెన్నో ఉన్నాయి. గతమెంతో ఘనం అనిపించేలా ఆ చరిత్రను గుర్తు చేసుకునే వేడుకలు జరగనున్నాయి. పర్యాటకులను ఆకర్షిస్తూ ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1861లో ఏర్పాటైన భీమిలి మున్సిపాలిటీ భారతదేశంలోనే రెండో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఏపీలో తొలి మునిసిపాలిటీ భీమిలి.. అది ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రారంభమైన భీమిలి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

పశ్చిమ వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్ర తీరానికి వచ్చేటప్పటికీ పల్లం కావడంతో అక్కడ సముద్ర తీరంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. పావురాళ్ళకొండ, ప్రఖ్యాత గాంచిన నరసింహస్వామి దేవాలయం, భీమేశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉన్నాయి. 16-18  శతాబ్దాల మధ్య ఐరోపా ఖండం వారు భారత దేశానికి వర్తకం చేసుకోటానికి వచ్చినప్పుడు భీమిలిలోనే డచ్ వారు అడుగుపెట్టారు. 1624లో డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్ వారికి మధ్య ఘర్షణలు వచ్చాయని చెబుతుంటారు. ఈ ఘర్షణల్లో 101 మంది సైనికులు 200 మంది స్థానికులు మరణించారని చెప్తుంటారు. ఇప్పటికీ భీమిలిలో డచ్ వారివి సమాధులు ఉండటంతో అక్కడకు వచ్చిన పర్యాటకులు వీటిని తప్పకుండా సందర్శిస్తుంటారు. 

భీమిలి బీచ్ పెద్దగా లోతూ ఉండదు కాబట్టి నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. కాకినాడకు, శ్రీకాకుళానికి మధ్య 8 లైట్ హౌస్లు నిర్మించారు.వాటిలో ఉన్న ఒక దీప స్తంభం 18వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్నీ తెలియచేస్తోంది. 24 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్ రోడ్ భారత దేశంలోని పెద్ద బీచ్ రోడ్డు లో ఒకటిగా చెబుతారు. గ్రామీణ వాతావరణం పట్టణం కలగలిసిన ఈ సాగర తీర పట్టణంలో ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తుంటారు. 

ఈ నెల 9,10 తేదీల్లో జరిగే భీమిలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎయిర్ బెలూన్ ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భీమిలి ఉత్సవ్ సమయంలో విశాఖ నుంచి భీమిలి వరకు ఉచిత బస్సులు నడపనున్నారు. ఈ ఉత్సవాలను 50 లక్షల బడ్జెట్ తో నిర్వహిస్తున్నామని తెలిపారు. భీమిలి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు.

భీమిలి ఉత్సవ్ సందర్భంగా ఉప్పుటేరులు, తెప్పల పోటీలు తెగ సందడి చేస్తాయి. కుర్రకారు జోరు చూపించే కబడ్డీ ఆటలు, భీమిలి ప్రత్యేక వంటకాల రుచులు, ఘుమఘుమలతో స్వాగతం పలుకుతాయి. రంగవల్లులతో ఊరంతా అందమైన హరివిల్లుల్లా కనిపిస్తుంది. డప్పుల హోరు..పులివేషాల జోరు.. సంప్రదాయ కళల ప్రదర్శనలు, సినీ కళాకారుల అభినయాలు, సంగీత విభావరులు ఒకటేమిటి రెండు రోజుల పాటు ఆద్యంతం ఆహ్లాదకరం. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా కర్ణాటక తమిళనాడు నుంచి పర్యాటకులు విచ్చేయనున్నట్లు తెలిపారు.

By
en-us Political News

  
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.