సామాన్యులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం.. ఏపీ సర్కార్ కొత్త పథకం

Publish Date:Apr 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్   ప్రజలకు మెరుగైన,  నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే రాష్ట్రంలో సరికొత్త ఆరోగ్య పథకాన్ని పట్టాలెక్కించబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. సామాన్యులకు సైతం అత్యాధునిక వైద్య చికిత్సలను ఉచితంగా అందించడమే ఈ పథకం  ప్రధాన ఉద్దేశమన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలో నెలకొన్న లోపాలను సరిదిద్దుతూ.. వ్యవస్థను ప్రక్షాళన చేయడమే   మొదటి ప్రాధాన్యతగా తెలుగుదేశం కూటమి సర్కార్ ముందుకు వెడుతోంది.  మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించిన మేరకు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, మందుల కొరత లేకుండా  ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా తీసుకురాబోయే ఆరోగ్య పథకం ద్వారా పేద,   మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది. 

వైద్య రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను  బలోపేతం చేయడం ద్వారా  మారుమూల ప్రాంతాల వారికి కూడా సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. టెలీ మెడిసిన్ వంటి సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా నిపుణులైన డాక్టర్ల సలహాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.

గతంలో ఉన్న పథకాలలోని లొసుగులను తొలగించి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శక  విధానంలో ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి  కసరత్తు చేస్తున్నది. నిధుల కేటాయింపు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా..  తక్షణ సహాయం అందేలా వ్యవస్థను రూపొందిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయంపై   హర్షం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా..  ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం సామాన్యులకు ఊరటనిస్తుందని పరిశీలకులు అంటు న్నారు.  ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, విధివిధానాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు మంత్రి చెప్పారు. 

By
en-us Political News

  
కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీంతో స్థానికులు భారీ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ బెలూన్లను అంటే సంచులను ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సరఫరా చేసే ప్రధాన పైపుల నుంచి ఈ బెలూన్లలోకి నేరుగా గ్యాస్‌ను నింపుతున్నారు. చిన్నపాటి లీకేజీ లేదా నిప్పు రవ్వ తగిలినా క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. గత్యంతరం లేని స్థితిలో ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.
ఇటీవల ఒక ప్రత్యేక సందర్భంలో వీరిద్దరూ కలిసినప్పుడు, వారి మధ్య జరిగిన సంభాషణ చాలా హుందాగా, ఆత్మీయంగా సాగింది. సచిన్ టెండూల్కర్ క్రీడా రంగానికి చేసిన సేవలను కొనియాడుతూనే.. వ్యక్తిగతంగా ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని లోకేష్ చాటుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రముఖులతో కలిసినప్పుడు అది కేవలం ఒక ఫోటో షూట్‌కో లేదా మర్యాదపూర్వక భేటీకో పరిమితం అవుతుంది. కానీ లోకేష్, సచిన్ విషయంలో మాత్రం వారి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, ఉమ్మడి అభిరుచులు వారి సంభాషణలో ప్రతిబింబించాయి.
భారతీయ మూలాలను కలిగిన మమ్దానీ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కింగ్ చార్లెస్-3 ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
ట్రాఫిక్ బూత్ లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఎండల తీవ్రత దృష్ట్యా ఉపశమనం పొందేందుకు జిల్లా ఎస్పీ చోరవతో చల్లటి నీటి తుంపరలను చల్లే ఫ్యాన్ లు ఏర్పాటు చేశారు.
గత ఏడాది చైతన్యపురిలో వెలుగులోకి వచ్చిన కేసులో మురుగన్ పేరు మొదట బయటపడింది. ఆ సమయంలో మూడు నెలలు జైల్లో గడిపి బయటకు వచ్చిన అతను మళ్లీ అక్రమ కార్యక లాపాలను కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట ఇది సాధారణ ఆత్మహత్యగా పోలీసులు భావించారు. అయితే ఆ తరువాత లభించిన 19 పేజీల సూసైడ్ నోట్ కేసు దిశను పూర్తిగా మార్చింది. సీతారాం ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన సూసైడ్ నోట్ లో సీతారాం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న మానసిక వేదనను వివరంగా పేర్కొన్నాడు.
అయితే ఇప్పుడు వేదిక మారింది. అవే తేదీలలో పార్టీ పండుగ మహానాడును నెల్లూరు జిల్లాలో జరపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకు రాజకీయకారణాలే కాకుండా.. జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
పోలీస్-ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై వచ్చిన అభిప్రాయాల మార్పు కోసం చర్యలు తీసుకున్నామన్నారు.
న్యాయపరంగా ఈ కేసులో ఊరట పొందేందుకు పూడి శ్రీహరి ప్రయత్నించినప్పటికీ, న్యాయస్థానాల్లో ఆయనకు చుక్కెదురైంది. తన అరెస్టును ఆపాలంటూ ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, లేదా స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించడంతో.. పోలీసులకు ఆయనను అరెస్ట్ చేసేందుకు మార్గం సుగమమైంది.
అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు ఖ్యాతి పెరుగుతోందన్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు మద్దతుగా బలమైన ప్రపంచ అనుసంధానం అవసరమన్నారు భారత ఆరోగ్య సంరక్షణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పినందుకు ముఖ్యమంత్రి అపోలో ఆసుపత్రులను అభినందించారు.
983లో రీజెన్సీ సెరామిక్స్‌ను స్థాపించిన జి.ఎన్. నాయుడు, దేశ సెరామిక్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సంస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.