రక్తానికి వైద్యం చేసుకోండి ఇలా...

Publish Date:Mar 13, 2023

Advertisement

మన శరీరంలో ఆక్సిజన్, హార్మోన్లు, విటమిన్లు, మినరల్స్, ఇతర ముఖ్యమైన పోషకాలు రక్తం ద్వారానే శరీర అవయవాలకు రవాణా అవుతాయి. అయితే విషపూరిత కణాలు రక్తంలో కలవడం వల్ల బ్లడ్ పాడవుతుంది. ఫలితంగా రక్తం పనితీరుపైనా ప్రభావం పడుతుంది… విషపూరిత పదార్థాలను లేదా కణాలను మనం నియంత్రించాలి. లేదంటే అవి వివిధ వ్యాధులకు కారణమవుతాయి.

◆రక్తం ఎందుకు శుద్దిగా ఉండాలంటే..

శరీరంలోని అన్ని అవయవాలు, టిష్యూ కణాలు రక్తంతో అనుసంధానం అయి ఉంటాయి. బ్లడ్ పాడవడం వల్ల గుండెపోటు,  పీసీఓడీ, మధుమేహం, ఊబకాయం, రక్త పోటు, బ్లడ్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి బయటపడాలంటే రక్తం శుద్ధిగా ఉండటం అవసరం.

◆మన రక్తం పరిశుభ్రంగా లేదని ఎలా తెలుసుకోవచ్చు?

అపరిశుభ్రమైన రక్తం యొక్క లక్షణాలు

చర్మ సమస్యలు

ఎక్కువగా జుట్టు రాలిపోవడం

ఆకలి మందగించడం

అతిగా నిద్రపోతున్న ఫీలింగ్

ముదురు పసుపు రంగులో మూత్రం

రక్తస్రావం అయ్యే వ్యాధులు

◆కారణమేమిటంటే..

రక్తం విషతుల్యం కావడానికి మూల కారణం 'పిత్త దోషం'(శరీరంలో వేడి), ప్రతికూల భావోద్యేగాలని ఆయుర్వేదంలో ఉంది.

◆రక్తాన్ని అపరిశుభ్రంగా మార్చే అలవాట్లు

కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, వేపుడు పదార్థాలు, ఉప్పు అధికంగా ఉన్న లేదా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తం అపరిశుభ్రంగా మారుతుంది..

ఫుడ్ కాంబినేషన్ సరిగ్గా లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణమే.. ఉదాహరణకు ఉప్పగా ఉండే స్నాక్స్ తింటూ టీ తాగడం, పిండిలో ఉప్పు, పాలు కలపడం. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం, పొగ తాగడం, మందు సేవించడం, సమయానికి తినకపోవడం, నిద్ర విషయంలో రాజీ పడడం ఇందుకు ప్రధాన కారణాలు.

టాక్సిక్ ఓవర్లోడ్ను తగ్గించుకోవాలి

రక్తాన్ని అపరిశుభ్రంగా మార్చే అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల టాక్సిక్ ఓవర్లోడ్ను తగ్గించుకోవచ్చు"

అనుసరించాల్సిన మార్గాలు

15 రోజులకు ఒకసారి ఉపవాసం

డిన్నర్ను రాత్రి 7 గంటలలోపు తినాలి

ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు తాగాలి

ఉప్పు వినియోగం తగ్గించాలి. చురుకుగా ఉండాలి.

వేపాకు

వేప శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. ఇది రక్తాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది. చర్మ సమస్యలకు చక్కని పరిష్కారంగా ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు పరగడుపున 4-5 వేపాకులను తినాలి

◆ఆరోగ్యకరమైన రక్తానికి కావాల్సిన ఆహారం

క్యారెట్లు, బీట్రూట్లు, సొరకాయ, చిన్న పొట్లకాయను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకు కూరలు, ముఖ్యంగా రుచిలో వగరుగా ఉండే ఆహార పదార్థాల వల్ల రక్తంలో విషతుల్యమైన కణాలను తొలగించవచ్చు. దానిమ్మ, మామిడి పండ్లు. అల్ల నేరేడు, ఉసిరి వంటి పండ్లు తరచుగా తింటూ ఉండాలి.

ఇవన్నీ పాటిస్తే మీ రక్తాన్ని సులువుగా శుద్ధి చేసుకోవచ్చు.

                                       ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.