బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నమ్మ మెట్రో శరవేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ కారిడార్ ఉద్యోగులు, విమానాశ్రయ ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బెంగళూరు మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్టులో ఒక అతిపెద్ద మైలురాయి నమోదైంది. ఈ ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్ కారిడార్ కోసం రూపొందించిన సరికొత్త మొదటి రైలు సెట్ (ట్రైన్సెట్) ఎట్టకేలకు బెంగళూరు నగరానికి చేరుకుంది. ఈ పరిణామంతో సిల్క్ బోర్డ్ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) వరకు సాగే మెట్రో కారిడార్ పనుల్లో భారీ కదలిక వచ్చింది. ఈ వార్త తెలియడంతో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిసరాల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులు, నిత్యం ప్రయాణాలు చేసే టెక్కీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అత్యాధునిక మెట్రో కోచ్లను కోల్కతాలోని ప్రసిద్ధ టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ ప్లాంట్ నుంచి అత్యంత భద్రతా ప్రమాణాలతో బెంగళూరుకు తీసుకువచ్చారు. ప్రయాణికుల రక్షణకు, ఆధునిక వసతులకు పెద్దపీట వేస్తూ ఈ కొత్త రైళ్లను డిజైన్ చేశారు. ఈ మార్గంలో భవిష్యత్తులో ఉండే విపరీతమైన రద్దీని తట్టుకునేందుకు వీలుగా మరిన్ని రైళ్లను నడపాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్లాన్ చేస్తోంది. ఈ రైళ్ల రాకతో కారిడార్కు సంబంధించిన సివిల్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా మారతహళ్లి, వైట్ఫీల్డ్ అనుసంధాన ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు ఈ మెట్రో అప్డేట్స్ను నిశితంగా గమనిస్తున్నారు.
ఈ బ్లూ లైన్ మెట్రో ప్రాజెక్టును అధికారులు రెండు ప్రధాన విభాగాలుగా విభజించి పనులను పూర్తి చేస్తున్నారు. మొదటి విభాగం కింద సిల్క్ బోర్డ్ నుంచి కేఆర్ పురం వరకు సుమారు 19 కిలోమీటర్ల పొడవున లైన్ నిర్మిస్తున్నారు. ఈ రూట్ పూర్తిగా ఐటీ కారిడార్ ఉద్యోగుల రద్దీని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. ఇక రెండవ విభాగంలో కేఆర్ పురం నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) వరకు ఏకంగా 37 కిలోమీటర్ల పొడవున మెట్రో లైన్ విస్తరిస్తోంది. ఇది విమాన ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
రైలు సెట్ నగరానికి చేరుకున్నప్పటికీ, వెంటనే పట్టాలపై ట్రయల్ రన్స్ నిర్వహించడం సాధ్యం కాదు. దీనికి ముందుగా డిపోల నుంచి మెయిన్ ట్రాక్ వరకు అవసరమైన టెక్నికల్ లింక్ పనులను ఇంజనీర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. రైళ్లను సురక్షితంగా పట్టాల మీదకు తీసుకురావడానికి ఈ కనెక్టివిటీ అత్యంత కీలకం. ప్రస్తుతం BMRCL అధికారులు సిల్క్ బోర్డ్ నుంచి కేఆర్ పురం వరకు ఉన్న 19 కిలోమీటర్ల స్ట్రెచ్పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఐటీ రంగం నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ నెలలోనే ఈ టెక్నికల్ లింక్ పనులను పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bengaluru-blue-line-metro-first-train-arrives-36-222030.html
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది