Publish Date:Jun 10, 2026
క్రికెట్ ప్రపంచంలో మరో సంచలనం నమోదైంది. బలమైన ఆస్ట్రేలియా జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. ఢాకా వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టుకు ఓపెనర్లు మంచి పునాది వేశారు. ఓపెనర్ టాంజిద్ హసన్ 54 పరుగులతో రాణించగా, ఆ తర్వాత వచ్చిన నజ్ముల్ హొసైన్ షాంటో 67 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ స్థిరంగా ముందుకు సాగింది. అయితే, మ్యాచ్ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు తిప్పిన క్రెడిట్ మాత్రం మోసద్దెక్ హొసైన్కే దక్కుతుంది.
మైదానంలోకి వచ్చిన మోసద్దెక్ హొసైన్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 70 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. చివర్లో టాస్కిన్ అహ్మద్ కూడా వేగంగా 20 పరుగులు చేయడంతో, బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగుల బలమైన స్కోరును బోర్డుపై ఉంచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా, లియామ్ స్కాట్ మరియు మ్యాట్ రెన్షా చెరో రెండు వికెట్లు సాధించారు. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అయితే, వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలగడంతో డక్వర్త్-లూయిస్ (DLS) పద్ధతిని వర్తింపజేశారు. దీని ప్రకారం ఆస్ట్రేలియా విజయం సాధించడానికి 42.2 ఓవర్లలో 278 పరుగుల సవరించిన లక్ష్యాన్ని నిర్దేశించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు బంగ్లాదేశ్ బౌలర్లు మొదటి బంతి నుంచే చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజరస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ డకౌట్గా వెనుతిరిగాడు. ఆ వెంటనే స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ కూడా కేవలం ఒకే ఒక్క పరుగుకే అవుట్ కావడంతో ఆసీస్ కోలుకోలేని దెబ్బతింది. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ 19 పరుగులు, కూపర్ కానోలీ 35 పరుగులు, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 47 పరుగులతో జట్టును ఆదుకోవడానికి కొంతవరకు పోరాటం చేశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెమెరాన్ గ్రీన్ ఒంటరి పోరాటం చేస్తూ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ అవతలి ఎండ్ నుంచి అతనికి ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీస సహకారం అందించలేకపోయారు. బంగ్లా బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ban-vs-aus-1st-odi-bangladesh-victory-36-222417.html
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.