మసాలా పౌడర్లలో ఇథిలీన్ ఆక్సైడ్... క్యాన్సర్ ప‌క్కా అంటున్న న్యూట్రీష‌న్లు

Publish Date:Apr 24, 2024

Advertisement

భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.  నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను సేక‌రిస్తున్న‌ట్లు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. 

ఎవరెస్ట్, ఎండీహెచ్‌ తయారు చేసిన మసాలాలు వాడొద్దని సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆ దేశ ప్రజలకు సూచించింది. ఈ కంపెనీల‌ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే....ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ పౌడర్, కర్రీ ఫౌడర్ మిక్స్డ్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలలో పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించామని హాంకాంగ్ ఆహార భద్రతా విభాగమైన 'సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ' సీఎఫ్ఎస్ చెప్పింది.  ఫెస్టిసైడ్ అవశేషాలున్న ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. ఇథిలీన్ ఆక్సైడ్ వంటి క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటే హాంకాంగ్ చ‌ట్టాల ప్ర‌కారం గరిష్టంగా 50వేల డాలర్ల జరిమానా విధిస్తారు. నేరం రుజువైతే జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

గ‌తంలోనూ అదే....2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది. వాళ్ళు చెప్పిందేమిటంటే ఈ సుగంధ ద్రవ్యాలలో సాల్మొనెల్లా ఉన్నట్లు అప్పట్లో గుర్తించారట‌. ఈ బ్యాక్టీరియా వల్ల అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం, వాంతులు అవుతాయి. 

అలాగే నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. శిశువులకు అంత చక్కెర ఇవ్వడం మంచిది కాదని బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.  ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ సహకారంతో ఈ రిపోర్టు రూపొందించారు.  

“ప్రతి ప్రోడక్టు ఎగుమతి చేయడానికి ముందు, వాటిని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుంది.  అయితే
 సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, బెల్జియన్ ల్యాబ్ నివేదికల‌కు, మ‌న‌ స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా టెస్ట్‌ల‌కు తేడా ఎందుకు వ‌చ్చింది? ఇదే చ‌ర్చ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. ఇండియాలో చేసే నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త క‌నిపించి, విదేశాల్లో జ‌రిపిన నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త లేక‌పోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని దేశ ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  దేశంలోని అన్ని తయారీ యూనిట్ల నుండి సుగంధ ద్రవ్యాల నమూనాలను సేకరించాలని ఫుడ్ కమిషనర్‌లను ఆదేశించింది. మసాలా దినుసుల నమూనాల సేకరణ ప్రక్రియ ఇప్ప‌ట్టికే ప్రారంభమైంది.  మూడు నాలుగు రోజుల్లో దేశంలోని అన్ని సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తామ‌ని కేంద్ర‌ ప్రభుత్వ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. 

భారతదేశంలోనూ ఆహార పదార్థాలలో ఇథిలీన్ ఆక్సైడ్ వాడకంపై నిషేధం ఉంది.  ఒక వేళ మసాలా దినుసుల్లో హానికరమైన పదార్థాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. తాము ఉత్ప‌త్తి చేసే ఉత్పత్తులకు, హానికరమైన అంశాలు జోడించరాదని అవగాహన కల్పించాలని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సుగంధ ద్రవ్యాల బోర్డుకు భార‌త ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.  భారతీయ బ్రాండ్‌లకు చెందిన నాలుగు సుగంధ ద్రవ్యాలు-మిక్స్ ఉత్పత్తుల అమ్మకాలపై హాంకాంగ్ మరియు సింగపూర్ విధించిన నిషేధాన్ని పరిశీలిస్తున్నట్లు  స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు.

ఇథిలీన్ ఆక్సైడ్ ఆరోగ్యంపై తీవ్ర‌ ప్రభావం చూపుతుందని  ఎబి రెమ శ్రీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇథిలీన్ ఆక్సైడ్‌ను 'గ్రూప్ 1 కార్సినోజెన్'గా వర్గీకరించిందని ఆమె చెప్పారు. అంటే "ఇది మానవులలో క్యాన్సర్‌కు కారణమవుతుంది.  మానవ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులు చికాకు కలిగించ‌డంతో పాటు మెదడు,  నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను తీసుకుంటామని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై చర్యలను ఖరారు చేయనున్నారు. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
ఏపీ ఇన్‌ఛార్జ్ డీజీపీగా శంఖబ్రతా బాగ్చి నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి డీజీపీని నియమించేవరకు బాగ్చి డీజీపీ
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.