పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు... కూట‌మిలో జోష్ పెంచిందా?

Publish Date:May 6, 2024

Advertisement

పోస్ట‌ల్ బ్యాలెట్ ఏపీ రాజ‌కీయాల్నే మ‌లుపు తిప్ప‌నుందా?   ప్రజలు ఎవరివైపు వున్నారు? అధికార‌, ప్ర‌తిప‌క్ష కూట‌మిలో అదే ఉత్కంఠ‌త‌.  మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తూ పావులు కదుపుతున్నారు.. మ‌రో వైపు జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, బీజేపీ కూట‌మి జోరుగా ప్రచారం చేస్తోంది. ఇరు ప‌క్షాలు  మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఓటు కీల‌కంగా మారింది. ముఖ్యంగా పోస్ట‌ల్ బ్యాలెట్ గెలుపు ఓట‌మిల నిర్ణ‌యంలో కీల‌కంగా మార‌నుంది. మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది. ఉద్యోగులు కూడా ఈసారి నూటికి నూరు శాతం ఓట్లు వేయడానికే మొగ్గు చూపించారు.

పోలింగ్ రోజైన మే 13వ తేదీ నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్,  రెండు రోజుల పాటు  కొనసాగిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆరంభమైన ఈ ఓటింగ్.. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న అయిదు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు  85 ఏళ్ళు నిండిన వయో వృద్ధుల కోసం హోం ఓటింగ్ ఈ నెల 3న స్టార్ట్ అయింది. ఈ నెల 10 వరకూ కొనసాగనుంది.  

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ తీరు చూస్తే, ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్థులలో అధికార పార్టీపై వున్న అస‌హ‌నం, ఆగ్ర‌హం స్ప‌ష్టంగా క‌న‌బ‌డింది.  ఉద్యోగులంతా తమవైపే అనుకున్న వైసీపీ ఇప్పుడు ఆలోచనలో పడింది.   పోస్ట‌ల్ బ్యాలెట్ తీరు చూస్తే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందని సోషల్ మీడియాలో విశ్లేషణలు వ‌స్తున్నాయి.   ఉద్యోగుల ఓట్లన్నీ తమకేనని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉంది అధికార పార్టీ, ఇప్పుడు చేతులెత్తేసింది. జీతాలు టైంకు ఇవ్వ‌కుండా ఉద్యోగులను తిప్పలు పెట్టారని, టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, వారితో స్కూల్ లో టాయిలెట్లు కడిగించారని, ఇతర డిపార్ట్ మెంట్లలో కూడా ఉద్యోగుల స్వేచ్ఛను హరించినందుకు ఉద్యోగ‌స్తులు ఇప్పుడు త‌మ ఆగ్ర‌హాన్ని ఓట్ల రూపంలో చూపారు.పోస్టల్ బ్యాలెట్ లో కూట‌మిదే పైచెయ్యి క‌నిపిస్తోంది.   
 
ప్ర‌భుత్వ ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ సీపీఎస్ రద్దు. అయితే దీని మీద ఈసారి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడేందుకే సాహసించలేదు. మరో వైపు చూస్తే కొత్త పీఆర్సీ విషయంలో పార్టీలు సానుకూలంగా మాట్లాడుతున్నా కూడా, రేపు అధికారంలోకి వచ్చాక ఎంత వరకూ నెరవేరుస్తాయన్నది డౌటే అన్న భావన కూడా ఉంది.  అటు అధికార వైసీపీ ఇటు టీడీపీ కూటమి కూడా ఒకరిని మించిన తీరులో మరొకరు సంక్షేమ పధకాలను ప్రకటించారు. ఖజనా పరిస్థితి ఏమిటో ఉద్యోగులకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం తేడా వచ్చినా మొదట తమ జీతాలకే కోత పెడతారని వాళ్ళు భ‌య‌ప‌డుతున్నారు.  అందుకే ఉద్యోగుల ఓట్లు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయి. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
తెలంగాణ గీతంలో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో రేవంత్ రెడ్డి చర్చించారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-9
మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు మరోమారు మారణహోమానికి పాల్పడ్డారు. ఓ మహిళపై పాశవికంగా దాడి చేశారు.
పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్‌.లో కొండ చరియలు విరిగిపడి 670 మంది మరణించారు
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను, తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ సాగర్ ఐలాండ్స్క 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రెమాల్ ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతున్నది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన‌ ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి భూబ‌కాసురుడిలా మారారా? విశాఖలో దళితుల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అప్ప‌నంగా మింగేయాలని ప్రయత్నించాడా? 2వేల కోట్ల రూపాయల భూముల‌ను కాజేసేందుకు స్కెచ్ వేశారా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. జ‌వ‌హ‌ర్ రెడ్డి మ‌రో నెల‌రోజుల్లో సీఎస్ ప‌ద‌వి నుంచి రిటైర్డ్ కానున్నారు.. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హాయ‌ స‌హ‌కారాల‌తో జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు, ప‌లువురు వైసీపీ ముఖ్య‌నేత‌లు అసైన్డ్ భుముల‌ను కాజేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌లో వున్న టి.ఆర్.పి. గేమ్ జోన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-10
వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ!
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌దేళ్ల త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది. అయిదే ఏపీ నేత‌లు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు త‌డిబ‌ట్ట వేసుకొని నిద్దుర‌పోతున్నారు.
ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.