బాలినేని.. మనిషొక చోట.. మనసొక చోట!

Publish Date:Oct 29, 2024

Advertisement

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి, వైసీపీ మాజీ నాయకుడు. అన్నిటికీ మించి జగన్ కు సమీప బంధువు. ఆయన ఇప్పుడు ఆ పార్టీని వదిలేసి జనసేన గూటికి చేరారు. అయినా ఆయన మానసిక బంధం ఇంకా జగన్ తోనే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం (అక్టోబర్ 28) మీడియాతో మాట్లాడుతూ జగన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి లైవ్ లో ఆయన పడిన ఇబ్బంది కళ్లకు కట్టినట్లు కనిపించింది. అలాగే తాను ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అనుకూలంగా ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాటా తడబడుతూనే వచ్చింది. మొత్తంగా షర్మిల, జగన్ మధ్య ఆస్తుల తగాదా విషయంపై మాట్లాడడానికి ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడిన మాటలు వింటే మనిషి జనసేనలోనూ మనసు వైసీపీతోనూ ఉందని పించేలా ఉన్నాయి. 

వాస్తవానికి ఆయన వైసీపీలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం, జనసేన నేతలు, శ్రేణులపై సాగించిన దాష్టికాలు, దౌర్జన్యాలూ ఇన్నీ అన్నీ కావు. అందుకే ఆయన జనసేన గూటికి చేరుతున్న సమయంలో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనసేన కార్యకర్తలూ ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేదు.  అయితే పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో గట్టిగా మాట్లాడలేకపోయారు. తెలుగుదేశం శ్రేణులూ మౌనం వహించాయి.

ఇక  సోమవారం (అక్టోబర్ 28) ఆయన మీడియా ముందు ఎలాంటి శషబిషలూ లేకుండానే తాను వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషినని చెప్పుకున్నారు. అంతే కాదు షర్మిల, జగన్ ల మధ్య ఆస్తుల వివాదంపై తన వైఖరి ఏదో స్పష్టంగా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. జగన్ కు విమర్శిస్తూ ఒక్క మాట కూడా చెప్పడానికి ఆయన సిద్ధంగా లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలిసేలా ఆయన తీరు ఉంది. షర్మిలతో ఆస్తి వివాదంలో వైసీపీ చంద్రబాబు పేరు లాగడం కరెక్టు కాదు అన్న మాట కూడా ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మద్దతుగా ఆయన గట్టిగా ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయారు. దీంతో  బాలినేనిపై తెలుగుదేశం, జనసేన శ్రేణులలో అనుమానాలు మరింత పెరిగాయి. ఆయన జనసేన గూటికి చేరడం వెనుక కూటమి ఐకమత్యాన్ని దెబ్బతీసే కుట్ర ఉందా అన్న సందేహాలు వారిలో వ్యక్తం అవుతున్నాయి.  

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఎన్నికలలో వైసీపీ ఓటమికి ఈవీఎంలే కారణం అంటూ బాలినేని ఆరోపించడమే కాకుండా,  ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలంటూ ఈసీని కోరారు. మొత్తంగా బాలినేని తాజా మీడియా మీట్ లో బాలినేనిలోని వైసీపీ అనుకూలత ప్రస్ఫుటంగా బయటపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.