బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల..ఎలా ఉన్నారంటే..?

Publish Date:Jul 22, 2026

Advertisement

 

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురై ఎడమ మోకాలికి గాయపడ్డారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న చిత్రీకరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్రబృందం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య పరీక్షలు, ప్రత్యేక చికిత్స అవసరమని భావించిన వైద్యులు బాలకృష్ణను ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ (AIG) ఆస్పత్రికి తరలిం చారు. ఏఐజీ ఆస్పత్రి బుధ వారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం, బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ రక్తం గడ్డకట్టడం (హీమటోమా), మృదు కణజాలాల్లో వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు.

అంతేకాకుండా మోకాలి భాగంలోని కండరాలు చిట్లి ఉండే (మసిల్ టియర్) అవకాశం కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. గాయం తీవ్రతను పూర్తిగా నిర్ధారించేందుకు ఎంఆర్ఐ సహా ఇతర ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణకు ఆర్థోపెడిక్ నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన గత వైద్య చరిత్రను కూడా పరిశీలిస్తూ, అవసరమైతే ఇతర విభాగాల నిపుణులతో సమన్వయం చేసి చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి తెలిపింది. అన్ని పరీక్షల నివేదికలు అందిన అనంతరం గాయానికి సంబంధించిన తుది నిర్ధారణ చేసి, శస్త్రచికిత్స అవసరమా లేదా మందులు, ఫిజియోథెరపీతోనే చికిత్స కొనసాగించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆయనను నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితిపై తదుపరి వివరాలను పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని ఏఐజీ ఆస్పత్రి మెడికల్ బులెటిన్‌లో పేర్కొంది. బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిన వెంటనే అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటన కారణంగా ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు సమాచారం.

Balakrishna Health Bulletin released, Film shooting, AIG Hospital, Hematoma, NBK111 shooting injury, Balakrishna health update, CM Chandrababu, Naralokesh, TDP
 

By
en-us Political News

  
లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతుండటంతో.. ఇంత కాలంగా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ అనివార్యంగా స్పందించాల్సి వచ్చింది.
విజిలెన్స్ విచారణ ఆధారంగా రెవెన్యూ అధికారులు విలువైన ప్రభుత్వ, ఇనాం భూములను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి ఆక్రమించిన ఈ భూములు మార్కెట్ విలువ వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్.. వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లు నిర్వహించడంలో రా ఎన్టీఆర్ తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇన్నాళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న రా ఎన్టీఆర్ హఠాత్తుగా సేవలను నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
లోహియా కార్ప్ ఐపీఓ ప్రారంభమైంది. రూ. 404 425 ధరల శ్రేణి, 8.47% జిఎంపి లాభాలు, ఆఫర్ ఫర్ సేల్ వివరాలు, కేటాయింపు డేట్లు మరియు బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీలో బోస్టన్ డైనమిక్స్ అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోల ప్రవేశానికి వ్యతిరేకంగా 39,000 మంది కార్మికులు చేపట్టిన చారిత్రాత్మక సమ్మె, రూ. 1,000 కోట్లకు పైగా ఉత్పత్తి నష్టం మరియు AI రోబోటిక్స్ యుగంలో ఉద్యోగ భద్రత గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అమెరికాలోని ఇర్మో పట్టణంలో పోలీసు అధికారుల కంటే ఎక్కువగా ఏఐ నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లాక్ కెమెరాల డేటా భద్రత, సైబర్ లోపాలు మరియు పౌర హక్కుల ఉల్లంఘనపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీకోసం.
జెన్ జీ ఉద్యోగులు ఆఫీస్ కంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్నారని యూగోవ్ సర్వే తెలిపింది. ఆఫీస్ డిస్ట్రాక్షన్స్, వర్క్ సంస్కృతి మరియు ఉత్పాదకతపై 53 శాతం మంది వెల్లడించిన కీలక నిజాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.