జాతీయోద్యమ శక్తి లోకమాన్య తిలక్!

Publish Date:Jul 20, 2022

Advertisement

బాలగంగాధర తిలక్. భారతజాతీయ ఉద్యమ పితామహునిగా పేరు పొందిన ఈయనను అందరూ లోకమాన్య అనే బిరుదుతో పిలుస్తారు. భారత జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడంలోనూ, సామాన్య ప్రజలను ఆ ఉద్యోమంలో చురుగ్గా పాల్గొనేలా చేయడంలోనూ గొప్ప పాత్ర పోషించినవాడు లోకమాన్య తిలక్. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో నీకున్న అశాంతికి కారణం ఆయనేనని, ఆయన వల్లనే బ్రిటిష్ వారి మీద భారతీయుల మనసులో పోరాట స్థాయి ఏర్పడటం కానీ, అది పెరగడం కానీ జరిగిందని చెబుతారు.

బాలగంగాధర్ తిలక్ 1856 జులై 23 వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి సంస్కృత పండితుడు, ఉపాద్యాయుడు. అందువల్ల చిన్నతనం నుండి చదువు విషయంలో మంచి అవగాహన ఉండేది. గణితశాస్త్రంలో ఈయనకు మంచి ప్రతిభ ఉండేది. తిలక్ జీవితంలో ఒక గొప్ప మార్పు తన పదేళ్ల వయసులో జరిగింది. అది అతని తండ్రి రత్నగిరి నుండి పుణెకి బదిలీ కావడం. 

పూణేలో ఉండే ఆంగ్లో- వెర్నాక్యులర్ పాఠశాలలో ఎంతో గొప్ప ఉపాధ్యాయుల దగ్గర చదువుకునే అవకాశం తిలక్ కు లభించింది. అయితే పుణెకి వచ్చిన ఆరేళ్ళ వ్యవధిలోనే తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయాడు ఈయన. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తరువాత దక్కన్ కాలేజీలో చేరాడు. కాలేజీకి వెళ్లి చదువుకున్న తొలితరం భారతీయుల యువకుల్లో తిలక్ ఉండటం గమనార్హం. 1877 లో గణితశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత L.L.B పట్టా పొందాడు.

రాజకీయ 

లోకమాన్య తిలక్ 1890 వ సంవత్సరంలో భారతజాతీయ కాంగ్రెస్ లో సభ్యుడిగా చేరాడు. అయితే అప్పటి కాలంలో జరుగుతున్న మితవాద రాజకీయాలపై ఆయనకు పెద్దగా నమ్మకం ఏర్పడలేదు. దేశానికి స్వాతంత్య్రం కావాలంటే పోరాటం చేయడమే సరైన మార్గమని ఆయన నమ్మారు. 

కాంగ్రెస్ పై విమర్శ!

కాంగ్రెస్ అప్పటికాలంలో సంవత్సరంలో డిసెంబర్ నెలలో కేవలం మూడురోజుల పాటు "pray, petition, protest" అనే  మూడు విఆహాయలు గురించి మాట్లాడటంతోనే సరిపెట్టుకుంది. దాని గురించి విమర్శిస్తూ "మీరు కేవలం మూడురోజుల పాటు కప్పల మాదిరి బెకబెకలాడితే  ప్రయోజనం ఉండదు" అని వ్యంగ్యంగా విమర్శించారు. అది మాత్రమే కాకుండా కాంగ్రెస్ అడ్డుకునే సంస్థ అయిపోయింది(బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడుక్కోవడం కాదు వాళ్ళ మీద తిరగబడి పోరాటం చేసి మన దేశాన్ని మనం సొంతం చేసుకోవాలని తిలక్ అభిప్రాయం) అని అన్నారు. 

నినాద కర్త!

"స్వరాజ్యం నా జన్మ హక్కు" అని గొంతెత్తి నినదించిన వాడు తిలక్. ఈయన తన గళాన్ని గట్టిగా వినిపించడం వల్ల అతివాదుల వర్గంలోకి చేర్చబడ్డాడు. 1907లో సూరత్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. అతివాదులు, మితవాదులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అప్పుడు చీలిపోయినా వాళ్ళు తిరిగి 1917 లో ముస్లిం లీగుకు, కాంగ్రెస్ కు జరిగిన ఒప్పందం సమయంలో మళ్ళీ కలిసిపోయారు.

సమాజంలో చురుకైన పాత్ర!

ఈయన సమాజంలో చాలా చురుకైన పాత్ర పోషించాడు. పాశ్చాత్య విద్యావిధానాన్ని వ్యతిరేకించాడు. అది భారతీయ వారసత్వాన్ని అగౌరవపరుస్తుందని చెప్పాడు. భారతదేశ ఔన్నత్యాన్ని భోధించాలనే ఉద్దేశ్యంతో అగర్కార్, విష్ణు శాస్త్రి చిప్లుంకర్ లతో కలసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ"  స్థాపించాడు. ఇంకా బ్రిటిష్ వారి పట్ల భారతీయుల ధోరణి మారాలనే ఉద్దేశ్యంతో మరాఠా పత్రిక, కేసరి పత్రికలలో ఘాటుగా వ్యాసాలు రాసేవాడు. ఈయన బాల్యవివాహాలను నిరసించాడు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.

ఉత్సవాల విస్ఫోటనం!

భారతదేశంలో పౌరులను భారతజాతీయోద్యమం వైపు నడిపేందుకు ప్రజలను ఒక్కచోటికి చేర్చేందుకు ఈయన చేసినది శివాజీ జయంతి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం. వీటి ద్వారా భారతీయ హిందూధర్మ గొప్పదనాన్ని తెలియజేయడమే కాకుండా జాతీయోద్యమం వైపు నడిపించే అవకాశం సృష్టించుకున్నాడు. 

కారాగార శిక్ష!

ఈయన పత్రికల్లో రాసే తన రాతల ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నాడనే కారణంతో ఒకటిన్నర సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఆ ఒకటిన్నర సంవత్సరం పూర్తవగానే స్వదేశీ ఉద్యమానికి సిద్ధమయ్యాడు. 1906 సంవత్సరంలో దేశద్రోహం కేసు మీద ఆరు సంవత్సరాలు ప్రవాస శిక్ష అనుభవించాడు.

గ్రంధకర్తగా!

ఈయన ప్రవాస శిక్ష అనుభవిస్తున్నప్పుడే గీతారహాస్యం అనే గ్రంధాన్ని రచించారు. అది మాత్రమే కాకుండా ఈయన మంచి చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని ఈయన తను రచించిన గ్రంధంలో పేర్కొన్నారు. 

హోంరూల్!

1916 లో హోంరూల్ లీగ్ స్థాపించారు. దాని గురించి వివరిస్తూ పల్లెపల్లెకు తిరిగాడు. అనీబిసెంట్ అదే సంవత్సరంలో ఆ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. అయితే తిలక్ ఒక కేసులో లండన్ వెళ్లగా బ్రిటిష్ వారు తెలివిగా పథకం వేసి అనీబిసెంట్ ఆ ఉద్యమాన్ని విరమించుకునేలా చేసింది. తిలక్, అనీబిసెంట్ ఇద్దరూ చెరొక దారిలో ఉండటం వల్ల హోంరూల్ లీగ్ మెల్లిగా చల్లారిపోయింది. ఆ తరువాత 1920 సంవత్సరంలో తిలక్ మరణించారు. ఆయన చనిపోగానే జాతీయోద్యమం ఇక దిక్కులేనిదైపోయిందని అందరూ అభిప్రాయపడ్డారు.

ఈ విధంగా లోకమాన్య బలగంగాధర తిలక్ భారతజాతీయోద్యమ కర్తగా, ఒక గొప్ప సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, బ్రిటిషు వారిని ఎదిరించిన శక్తిగా అన్నిటికంటే ముఖ్యంగా ఒక గొప్ప విద్యావంతుడిగా భారతీయ చరిత్రలో నిలిచిపోయాడు.

                                 ◆ వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.