కలిశారు సరే.. ఏం మాట్లాడారు?

Publish Date:Jun 4, 2023

Advertisement

తెలుగుదేశం   అధినేత చంద్రబాబునాయుడు హస్తిన వెళ్లారు. అమిత్, జేపీ నడ్డాలతో సమవేశం అయ్యారు.  అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని వేరే చెప్పాల్సిన పని లేదు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు అమిత్షా తో బేటీ కావడం ఇదే తొలిసారి.  

అంతే కాకుండా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమంయంలో జరిగిన ఈ భేటీలో అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు చర్చలు పూర్తిగా రాజకీయపరమైనవేనని అనడంలో సందేహం లేదు.  అయితే అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు ఏం చర్చించి ఉంటారన్న విషయంలో రాజకీయ వర్గాలలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేరాల్సిందిగా కోరేందుకే బీజేపీ హై కమాండ్ చంద్రబాబును హస్తినకు పిలిచిందన్న వాదన రాజకీయవర్గాలలో గట్టిగా సాగుతోంది.  

అదే సమయంలో గత నాలుగేళ్లుగా ఏపీలో బీజేపీ అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన బలంగా జనంలోకి వెళ్లిపోయిందని గట్టిగా నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ సమయంలో ఏపీలో బీజేపీ పొత్తు, ఎన్డీయేలో చేరిక అంటే ప్రజలలో పలుచన అయ్యే అవకాశం ఉందన్న సంగతి ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని అంటున్నారు.  ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు సిద్ధపడితే అది పార్టీకి ప్రయోజనం చేకూర్చడం అటుంచి నష్టం చేకూర్చే అవకాశాలే అధికంగా ఉంటాయని చంబ్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం,  రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నా, కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నా.. ఇంత కాలం కేంద్రం వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలవడం, ఆర్థిక అరాచకత్వానికి మద్దతు ఇవ్వడాన్ని చంద్రబాబు ఆ సందర్భంగా వారి వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ తీరు వెనుక కూడా కేంద్రం ఉందన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెద్దగా ఉపయోగం ఉండదనీ, ముందు కేంద్రంలోని మోడీ సర్కార్ వైసీపీకి వ్యతిరేకం అన్న భావన కలిగేలా వ్యవహరించి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న తెలుగుదేశం, జనసేన పార్టీలతో క్షేత్ర స్థాయిలో కలిసి ఉద్యమాలలో పాల్గొంటే.. ఆ తరువాత పొత్తుల విషయం మాట్లాడుకోవచ్చని చంద్రబాబు అమిత్ షా నడ్డాలకు వివరించారని అంటున్నారు.

అన్నిటికీ మించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తు కంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీకి దూరం పాటించడం అవసరమనీ, అప్పుడు సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వివరించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు తెలుగుదేశం లోక్ సభలో అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అరాచకాలు, అక్రమాలకు పాల్పడకుండా   గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా చెప్పారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.

అన్నిటికీ మించి రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ వ్యతిరేకమన్న విషయాన్ని గట్టిగా చాటితే బీజేపీకి అవసరమైతే  తెలంగాణలో టీడీపీ నుంచి సహకారంఅందుతుందని కూడా చంద్రబాబు  అమిత్ షా నడ్డాలకు హామీ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు.  ఇవన్నీ పక్కన పెడితో అమిత్ షా, నడ్డాలతో బాబు భేటీపై ఏపీ సర్కార్ లో కలవరం విస్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ నేతలు, మంత్రులు ఈ భేటీపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ చూస్తుంటే  తమకు గతంలోలా కేంద్రం మద్దదు లభించదేమోన్న భయం వారిలో ప్రస్ఫుటమౌతోంది. 

By
en-us Political News

  
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.