టేక్ డైవర్షన్ ప్లీజ్!

Publish Date:Dec 28, 2013

Advertisement

 

మన రాజకీయ పార్టీలు ఎప్పుడయినా వివాదాలలో లేదా ఇబ్బందులలో చిక్కుకొన్నప్పుడు వెంటనే వేరే ఆసక్తికరమయిన అంశం ఏదో అందుకొని మాట్లాడుతూ ప్రజల, ప్రత్యర్ధుల మీడియా దృష్టిని మళ్ళిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ట్రిక్కుని అనేక ఏళ్లుగా చాలా విజయవంతంగా అమలుచేస్తూ అనేక సార్లు గండం గట్టెకింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు, లోక్ పాల్ బిల్లుని, ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ అవినీతిపై పోరాటాన్నిదొరకపుచ్చుకొని సమస్యలనుండి బయటపడ్డారు. అయితే రాహుల్ గాంధీ పొరపాటున తమ కొంపముంచే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణాన్ని కెలుక్కోవడంతో, ఇప్పుడు ఆ సమస్య నుండి బయటపడేందుకు అర్జెంటుగా మళ్ళీ మరో కొత్త అంశం కోసం కాంగ్రెస్ వెదుకులాడుతోంది.

 

ఇక, మొన్న శాసనసభ సమావేశాలు మొదలయ్యినప్పుడు తెదేపా నేతలు రెండుగా చీలిపోయి మీడియా ముందు, సభలో చాల జోరుగా వాదించేయడంతో తెరాసకు అడ్డుగా దొరికిపోయారు. అప్పుడు తెరాస నేతలు తమపై దాడి మొదలుపెట్టేసరికి తెదేపా నేతలు ఆత్మరక్షణలో పడ్డారు కానీ వెంటనే తేరుకొని వారు కూడా ఆ ‘ట్రిక్కు’ని మరోమారు విజయవంతంగా ప్రయోగించి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయనందునే తెలంగాణా ఆలస్యమయిపోతోందని వారు లొల్లి చేయడంతో అందరి దృష్టీ తెదేపాపై నుండి తెరాసపైకి మళ్ళింది. ఇదేసమయంలో తెదేపా నేతలకు వీ.హనుమంత రావు వంటివారు కూడా కోరస్ పాడటం మొదలు పెట్టడంతో ఈసారి తెరాస ఆత్మరక్షణలో పడింది.

 

ఇటువంటి టీ కప్పులో తుఫానులను అనేకం చూసిన కేసీఆర్ వెంటనే రంగంలోకి దూకి, రాష్ట్ర విభజన బిల్లులో అత్యవసరంగా చేయవలసిన సవరణల గురించి చర్చ మొదలుపెట్టి, అవసరమయితే మళ్ళీ ఉద్యమానికయినా సిద్దమని ప్రకటించేయడంతో మ్యాటర్ ఆటోమేటిగ్గా దానికి డైవర్ట్ అయిపోయింది. ఆ తరువాత ఆయన టీ-కాంగ్రెస్ నేతలను, రాష్ట్రపతిని కలవడం వంటివి చేయడంతో ‘విలీనం’ పాయింటుని మరి వినపడకుండాపోయింది. ఒకవేళ మళ్ళీ వినబడినా దానికి కౌంటర్ గా టీ-బిల్లు- సవరణలు అనే టాపిక్ ఉంది గనుక పెద్దగా ఇబ్బంది ఉండదు.

 

ఇక అందరి గురించి చెప్పుకొని వైకాపాను వదిలేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. గనుక వాళ్ళ గురించి కూడా ఓ నాలుగు ముక్కలు చెప్పుకోవలసిందే. దిగ్వజయ్ సింగ్ ‘జగన్ నా కొడుకువంటి వాడు’ అని కలవరించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి అక్రమ సంబంధం లేదని రుజువు చేసేందుకు జగన్ సోనియాగాంధీని విమర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక సమైక్య ముసుగులో విభజనవాదం చేస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పుడల్లా జగన్ అఫిడవిట్స్ గురించి మాట్లాడటం వీలయితే ఓసారి రాష్ట్రపతిని కలిసి రావడం కూడా ఆనవాయితీయే.

 

ఈ రాజకీయ గందరగోళం చూసి జనాలు వెంటనే ఏ సినిమా న్యూస్ కో షిఫ్ట్ అయిపోయి దాని గురించే ఆలోచించడం, మాట్లాడటం మొదలుపెడతారు.ఇలా డైవర్షన్ సాగుతూనే ఉంటుంది.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.