Publish Date:Aug 12, 2022
ప్రముఖ రచయత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ‘ది శాటనిక్ వర్సెస్’ పుస్తకం వివాదాస్పదమైంది. సల్మాన్ రష్దీ దైవ దూషణ చేశారంటూ ముస్లింలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ఆయనపై ఫత్వా విధించింది. రష్దీని ఖతం చేసిన వారికి 3 మిలియన్ డాల్లర్లు నజరానా ప్రకటిస్తూ ఇరాన్ నజరానా ప్రకటించింది. ముస్లింల నుంచి బెదరింపులు ఎదుర్కొంటున్న రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది.
న్యూయార్క్ లోని ఒక విద్యా సంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా ప్రేక్షకుల్లోంచి వేదికపైకి దూసుకు వచ్చిన ఒక అగంతకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు. భారత సంతతికి చెందిన రష్దీ ముంబైలో 1947లో రష్దీ జన్మించారు. ఆ తరువాతి కాలంలో బ్రిటన్ కు తరలి వెళ్లారు. 1981లో ఆయన రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు లభించాయి. ఆ తరువాత 1988లో ఆయన రచించిన ‘ది శైటానిక్ వర్సెస్’ వివాదాస్పదమైంది.
పలు ఇస్లామిక్ సంస్థలు ఆయన పై మండి పడ్డాయి. ఆయనను హత్య చేస్తామంటూ బెదరింపులు కూడా వచ్చాయి. ఇరాన్ అయితే తమ దేశంలో దిశాటినిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా రష్దీ పై ఫత్వా కూడా విధించింది. దీంతో ఆయన దాదాపు దశాబ్దం పాటు పూర్తిగా ఆజ్ణాతంలో ఉన్నారు.
ఆయన ఎక్కడ ఉంటున్నదీ కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై న్యూయార్క్ లో దాడి జరిగింది. వేదికపైకి దూసుకు వచ్చిన అగంతకుడు కత్తితో ఆయన మెడపై పొడిచాడు. వెంటనే ఆయన కుప్పకూలిపోయారు. దాడికి పాల్పడిన అగంతకుడిని వేదికపై ఉన్న వారు పట్టుకున్నారు. కుప్పకూలిన రష్దీని హుటాహుటిన హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/attack-on-salman-rashdi-writer-od-satanic-verdus-25-141835.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.