కేజ్రీవాల్ ఇల్లు మారిన గంటల్లోనే క్రేజీ ట్విస్ట్

Publish Date:Apr 25, 2026

Advertisement

 

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం నిలువునా చీలిపోయింది. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆప్ రాజ్యసభ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ రాఘవ్ చడ్డా నాయకత్వంలో విలీన పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించారు. ఆప్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చడ్డా ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యులు ఉండగా, అందులో ఏడుగురు వలసబాట పట్టడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. 

రాఘవ్ చడ్డా, అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్బజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, స్వాతి మలివాల్, విక్రమ్ సింగ్ సాహ్ని బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు.ఇదిలా ఉంటే, రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి చడ్డాను అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే తొలగించారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే చడ్డా పార్టీ మారడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. మరోవైపు, కేజ్రీవాల్ నియమించిన కొత్త డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అశోక్ మిట్టల్ కూడా చడ్డా వెంట వెళ్లడం ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

ఇక మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే—ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అశోక్ మిట్టల్ ఆయనను తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. మండీ హౌస్ సమీపంలోని 5 ఫిరోజ్‌షా రోడ్ బంగ్లాలో కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి కొంతకాలం నివసించారు. అనంతరం, జాతీయ పార్టీ అధినేత హోదాలో లోధీ ఎస్టేట్‌లోని బంగ్లాను ప్రభుత్వం ఏప్రిల్ 24న కేజ్రీవాల్‌కు కేటాయించగా, ఆయన అక్కడికి మారారు.అయితే, కేజ్రీవాల్ ఆ నివాసం నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటలకే అశోక్ మిట్టల్ ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇది కేజ్రీవాల్‌కు ఊహించని షాక్‌గా భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది.
మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది.
400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు
రాజేంద్రనగర్ లో విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది.
ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది.
ప్రజాదరణపై ఏ స్థాయిలో ఉంటుందో రాఘవ్ చద్దా ఉదంతం మరోసారి నిరూపించింది.
వీసా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనే నెపంతో.. ప్రైవేట్ వ్యక్తులు కెమెరాలతో భారత హఎచ్ 1బి వీసా ఉద్యోగులు పని చేస్తున్న కార్యాలయాలకు, వారి నివాసాలకూ కూడా వెళ్లి హల్‌చల్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉద్యోగులను కలవరానికి గురి చేస్తున్నది.
ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన కాకినాడలోని మొబైల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.