పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 2.!
Publish Date:Aug 18, 2026
Advertisement
పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తరువాత దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నాలుగో స్థానానికి పరిమితమైంది. దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో నవ్యాంధ్రప్రదేశ్ రికార్డు స్థాయి పురోగతి సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. బిజినెస్ స్టాండర్డ్, అలాగే.. దేశవ్యాప్తంగా పెట్టుబడుల సమాచారాన్ని ట్రాక్ చేసే ప్రాజెక్ట్స్ టుడే తాజా నివేదిక ప్రకారం, నూతన పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఏపీ ఏడు స్థానాలు మెరుగుపడింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2024-25 5వ స్థానానికి, ఇప్పుడు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2వ స్థానానికి చేరుకుంది. ఈ పురోగతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలు , పెట్టుబడిదారులలో కలిగిస్తున్న నమ్మకమే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కే పరిమితమైన నినాదాన్ని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చి, పారిశ్రామిక అనుమతుల మంజూరులో చూపుతున్న వేగం, ప్రాజెక్టుల గ్రౌండింగ్ లో జాప్యం నివారణ పద్ధతుల అమలే కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశమైన గుజరాత్ రాష్ట్రం ఈ పెట్టుబడుల పోటీలో నాలుగో స్థానంలో నిలవగా, చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానాన్ని కైవశం చేసుకోవడం ఇప్పుడుదేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా కొత్త పెట్టుబడులను పొందుతున్నప్పటికీ, ఏపీ సాధించిన వృద్ధి వేగం ముందు అవి సాధించినది చాలా స్వల్పమనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ వైపు అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడిదారులు పరుగులు తీయడానికి బహుముఖ రంగాలు కారణంగా చెప్పుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం (renewable energy), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఐటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ రంగాలలో ఏపీ భారీగా మూలధనాన్ని రాబడుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రతిపాదిత పెట్టుబడులలో ఏపీ 25.3 శాతం వాటా దక్కించుకుంది. సుస్థిర పాలన, పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన సంస్కరణలు ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుస్తున్నాయి. పారిశ్రామిక వృద్ధిలో పాత పరిమితులను అధిగమించి, దేశంలోనే పెట్టుబడుల రాజధానిగా ఎదిగే దిశగా ఏపీ వేగంగా అడుగులు వేస్తోంది. APinvestmentrankings, Chandrababu Naidu investments, APrises, 2nd rank, Gujarat 4th, Projects Today report, Speed of doing business AP
http://www.teluguone.com/news/content/apinvestmentrankings-36-229198.html




