మూడు రోజుల్లోనే వందల కేసులు! కరోనా హాట్ స్పాట్లుగా స్కూళ్లు?

Publish Date:Nov 5, 2020

Advertisement

జగన్ సర్కార్ మెండి వైఖరి ఏపీని మళ్లీ ప్రమాదంలోకి నెడుతుందా? రాష్ట్రంలో కరోనా మళ్లీ పంజా విసరనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంగా స్కూళ్లను తెరవడంతో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. బడులు తెరిచిన మూడు రోజుల్లోనే దాదాపు 3 వందల వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది. అన్ని జిల్లాల్లోనూ స్కూళ్లకు వస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్ భారీన పడుతున్నారని తెలుస్తోంది. అన్ లైన్ క్లాసుల నిర్వహణ సమయంలోనూ చాలా మంది టీచర్లు, సందేహాల నివృత్తి కోసం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు కరోనా సోకింది. వారి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్ అంటుకుంటోంది. ఇప్పుడు స్కూళ్లు తెరవడంతో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఏపీ ప్రజల్లోఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులు, టీచర్ల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

ఏపీలో బడి తలుపులు తెరిచి మూడు రోజులైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 239 మంది ఉపాధ్యాయులు, 44 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్టు గుర్తించారు. మరిన్ని పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో ఏకంగా 25 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు గుర్తించారు. వారిలో వైరస్‌ లక్షణాలు పెద్దగా లేకపోయినప్పటికీ స్ర్కీనింగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 10 రోజుల్లో 172 మంది ఉపాధ్యాయులకు, 262మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరంతా తొమ్మిది,  పదో తరగతి విద్యార్థులే. ఆన్‌లైన్ పాఠాల్లో సందేహాల నివృత్తి కోసం స్కూళ్ళకు వెళ్ళిన సమయంలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. 

 

ప్రకాశం జిల్లాలోని స్కూళ్లల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా ఏడుగురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు, ఓ హెచ్ఎంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  విశాఖ జిల్లా విద్యా శాఖలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 52 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో 46 మంది ఉపాధ్యాయులు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 500 మంది ఉపాధ్యాయులకు ఇటీవల కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా 5 శాతం మంది కొవిడ్‌ బారిన పడినట్లు వెల్లడైంది.

 

కర్నూలు జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్న మూడు రోజులకే ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. అక్టోబరు నుంచి ఇప్పటివరకు జిల్లాలో 38 మంది టీచర్లు, 125 మంది విద్యార్థులకు కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో  ఇప్పటికే ఏకంగా 187 మంది ఉపాధ్యాయులకు, 13 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు తేలింది. 
                   

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. చాలా దేశాల్లో  వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. అమెరికాలో రోజూ లక్ష కొత్త కేసులు వస్తున్నాయి. యూరప్ లోనూ సేకండ్ వేవ్ భయంకరంగా విస్తరిస్తోంది. లండన్, పారిస్ సహా పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. మనదేశంలోనూ కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో సేకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ధర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని ప్రజలను అలర్ట్ చేశారు సీఎం కేజ్రీవాల్. వింటర్ సీజన్ లో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముందని, మూడు నెలల వరకు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ సహా దేశంలోని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. 
 

కరోనా సేకండ్ వేవ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుండగా.. మన దేశంలోని ఢిల్లీ, కేరళలో ఇప్పటికే కనిపిస్తుండగా ఏపీ సర్కార్ మాత్రం మెండిగా వ్యవహరిస్తోంది. తాము అనుకున్నది జరగాలన్నట్లుగా స్కూళ్లను నడిపిస్తోంది. దీంతో ఏపీలో తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఏపీలో గతంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు రాగా.. ప్రస్తుతం మూడు వేలకు లోపుగానే వస్తున్నాయి. ఈ సమయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన జగన్ సర్కార్.. పట్టుదలకు పోతూ ప్రజల ప్రాణాలకు గండం తెస్తుందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. స్కూళ్లను కొనసాగిస్తే ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 

స్కూళ్లు తెరిచినా మూడు రోజుల్లోనే టీచర్లు, విద్యార్థుల్లో దాదాపు 3 వందల మందికి కరోనా పాజిటివ్ రావడం భవిష్యత్ అనర్ధాలకు సంకేతమిస్తోంది. దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి పేరెంట్స్ ఇష్టపడటం లేదు. దీంతో మొదటి రోజు దాదాపు 20 శాతం మంది విద్యార్థులు స్కూళ్లకు రాగా.. మూడో రోజుకి అది ఐదు శాతానికి పడిపోయిందంటున్నారు. ఇక విద్యాశాఖలోనూ కరోనా కలవరం రేపుతోంది. కేసులు పెరిగితే స్కూళ్ళకు సెలవులు ప్రకటించాలని జిల్లాల డీఈవోలు భావిస్తున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో స్కూళ్లు నడిపించినా పిల్లలు రారని, ప్రభుత్వమే ఆలోచించి స్కూళ్లను నిలిపివేయాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.