ఏపీ లిక్కర్ కుంభకోణం.. మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు అరెస్టు?
Publish Date:Jun 11, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం (జూన్ 11) అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసందే. రాజ్ కసిరెడ్డిని ఈడీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు, రవాణా వ్యవస్థలో జరిగిన వందల కోట్ల రూపాయల లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలిస్తు న్నారు. అక్రమ ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు, మనీలాండరింగ్ ఆరోపణలపై కీలక ఆధా రాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రాజ్ కసిరెడ్డి, కార్మూరి నాగేశ్వరరావుల విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా మరికొందరు కీలక వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-case-36-222608.html





