బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్.. మరి ఏపీలో?

Publish Date:Nov 8, 2015

Advertisement



బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ఆ పార్టీ మతతత్వ పార్టీ అనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తూనే వుంటాయి. ఆ విమర్శల తీవ్రత చూస్తుంటే బీజేపీ మీద వున్న మతతత్వ పార్టీ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదేమో అనిపిస్తూ వుంటుంది. ఇంతకాలం ‘మతతత్వ’ ముద్ర వున్న బీజేపీ మీద ఇప్పుడు కులతత్వ ముద్ర కూడా పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీహార్లో విజయం సాధించడం కోసం బీజేపీ కులాన్ని పావులా వాడుకుంది. జితన్ రామ్ మాంఝీ, ఇలాంటి ‘క్యాస్ట్ కార్డు’ వున్న మరికొందరు నాయకులను చేరదీయడం ద్వారా కులపరమైన లబ్ధిని ఈ ఎన్నికలలో పొందాలని బీజేపీ ప్లాను వేసింది. అయితే ఆ ప్రయత్నాలు, ప్రయోగాలు విఫలమై బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయని విశ్లేషిస్తున్నారు. బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్ అయిందని తాజాగా వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. మరి అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా కుల రాజకీయాలను నడుపుతోంది... మరి ఆ రాజకీయాల పర్యవసానం ఎలా వుండబోతోందో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశానికి మిత్రపక్షంగా వుండి, అధికారంలో భాగస్వామ్యం పొందిన భారతీయ జనతా పార్టీ ఏపీలో తన భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటోంది. మిత్రుడు మిత్రుడే రాజకీయం రాజకీయమే అన్నట్టుగా ఏపీ బీజేపీ నాయకుల వ్యవహారశైలి వుంది. 2019లో వచ్చే ఎన్నికలలో ఏపీలో సొంతగా అధికారాన్ని సంపాదించేయాలన్న అత్యుత్సాహం బీజేపీ నాయకులలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే టీడీపీతో మిత్రధర్మాన్ని పాటించకుండా వ్యాఖ్యలు చేయడంతోపాటు కుల రాజకీయాలను కూడా నడుపుతున్నారని విశ్లేషిస్తున్నారు.

ఏపీ బీజేపీకి మొదటి నుంచి కమ్మ కులానికి చెందినవారే మహారాజపోషకులు. ఏపీలో బీజేపీ నిలదొక్కుకోవడానికి ఆ కులం వారే ప్రధానంగా కృషి చేశారు. అయితే ఆ సామాజికవర్గం బీజేపీకి ఎంతగా ఉపయోగపడుతున్నా, ఎంతయినా వాళ్ళు టీడీపీకి అనుకూలంగా వుంటారు కాబట్టి, ఆ కులాన్ని పార్టీలో ఎదగనీయకూడదన్న ధోరణి ఏపీ బీజేపీలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాపు, రెడ్డి కులాలను మంచి చేసుకోవడం ద్వారా ఏపీలో రాజకీయంగా అగ్రస్థానానికి వెళ్ళిపోవాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఆ ప్రయత్నాల్లోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు కులానికి చెందిన సోము వీర్రాజును నియమించబోతున్నారని సమాచారం. సోము వీర్రాజు సామాన్యుడేం కాదు.. బీజేపీ ఆలోచనలను అక్షరాలా అమలు పెట్టే ‘వాగ్ధాటి’ వున్న నాయకుడు. టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎదిగి ఆ పార్టీనే విమర్శించగల రాజకీయ చతురుడు. ఆ చతురతతోనే కాపులను, రెడ్లను బీజేపీకి స్నేహితులుగా చేసే కృషి చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

ఆ కృషిలో భాగంగానే ఔట్ డేటెడ్ కాపు నాయకుడైన చేగొండి హరిరామ జోగయ్య రాసిన ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ బీజేపీ నాయకులుహాజరయ్యారు. కాపు నాయకుడు వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం వుందని రాశారని తెలిసినా ఎంతమాత్రం ఇబ్బంది పడకుండా ఆ సభలో పాల్గొన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు మీద కోపం వున్న పురందేశ్వరి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రంగా హత్య జరిగిన సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నారన్న విషయం ఆమె మరిచారనుకోలేం. కాపులను మంచి చేసుకోవడం కోసం, చంద్రబాబు మీద పగ తీర్చుకోవడం కోసం ఆమె ఆ సభకు మనసు రాయి చేసుకుని వెళ్ళి వుంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీ బీజేపీ నాయకులు మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్‌ని గ్రిప్‌లో పెట్టుకుని కాపు ఓటు బ్యాంకు సంపాదించుకుందామని అనుకున్నారు. అయితే నిలకడలేని పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుంటే దేన్నో పట్టుకుని గోదారి ఈదినట్టని అర్థం చేసుకున్నారు. అందుకే ఇతర మార్గాల ద్వారా కాపులకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటు కాపులతోపాటు వైఎస్ జగన్‌కి చేరువ కావడం ద్వారా రెడ్లను కూడా తమ పార్టీ వైపు తిప్పుకుని 2019 ఎన్నికలలో చక్రం తిప్పాలన్నది బీజేపీ వ్యూహంగా వుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా బీహార్లో కుల రాజకీయాలు బీజేపీకి చేదు అనుభవాన్ని ఇచ్చాయి. మరి ఏపీలో ఎలాంటి అనుభవాన్ని ఇవ్వబోతున్నాయో వేచి చూడాలి.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.