కవ్విస్తూ నిందించడం ఆయనకే చెల్లు!

Publish Date:Jul 9, 2015

Advertisement

 

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఒక వివాదం సమసిపోక ముందే మరొకటి మొదలవడం సర్వసాధారణం అయిపోయింది. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తుతున్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోగా ఆయనే తెలంగాణాకు సమస్యలు సృష్టిస్తున్నారని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణా ట్రాన్స్ కో నుండి ఏకపక్షంగా 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను తొలగించడం, రెవెన్యూ శాఖలో చేస్తున్న35మంది ఆంధ్రా ఉద్యోగులను తొలగించడం, రెండు రాష్ట్రాలకు చెందాల్సిన సెక్షన్: 10 క్రిందకు వచ్చే 142 సంస్థలన్నిటినీ ఏకపక్షంగా స్వాధీనం చేసుకొని అందులో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను బయటకి పంపాలనుకోవడం వంటి కవ్వింపు చర్యలకి పాల్పడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడుని నిందించడం విచిత్రం. రాజకీయ నాయకులని పదవులు కోల్పోయినా, తొలగించబడినా వారు మళ్ళీ ఏదో విధంగా అధికారం సంపాదించుకోగలరు. కానీ ఉద్యోగులకు అటువంటి అవకాశం ఉండదు. గత రెండు మూడు దశాబ్దాలుగా తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను ఇలాగ అర్ధంతరంగా తొలగిస్తే వారి పరిస్థితి, వారి మీదే ఆధారపడిన వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఆంధ్రా ప్రజల కాలిలో ముల్లు దిగితే తన నాలికతో తీస్తానన్న పెద్దమనిషి ఇప్పుడు ఏకంగా వారిని రోడ్డున పడేస్తే వారు తమ ఘోడు ఎవరికి మొరపెట్టుకోవాలి?   

 

ఉద్యమ సమయంలో ఇటువంటి దూకుడు వల్ల ఆశించిన ఫలితాలు వచ్చి ఉండవచ్చును. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే దూకుడు ప్రదర్శించడం వలన ప్రభుత్వాల మధ్య, చివరికి ప్రజల మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడేందుకే అది దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలున్నాయి. కనుక రెండు ప్రభుత్వాలు వాటిపైనే తమ దృష్టి లగ్నం చేసి పనిచేయాలి తప్ప ఇటువంటి రాజకీయాలతో కాదని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.