జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది తేల్చుకోలేక పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో మాత్రం అధిష్ఠానం ప్రయత్నాలు అధిష్ఠానానివే.. అన్నట్లుగా ఉంది. ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.
ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు టీకెట్ పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో విభేదాలు కూడా జూబ్లీ బైపోల్ ముంగిట రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పొన్నం మీద ఫైర్ అయ్యారు. తన కుమారుడు ఎంపీగా ఉండటంపై కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు అంజన్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది, దీనిపై మాట్లాడడానికి మధ్యలో పొన్నం ప్రభాకర్ ఎవరంటూ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కంటే తాను చాలా సీనియర్ ని అని అంటూ.. కాంగ్రెస్ లో ఒకే కుబుంబం నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నారంటూ ఓ పెద్ద లిస్టు చెప్పారు. ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క ఉండగా, ఆయన అన్న మల్లు రవి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు.
అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, మంత్రి కొమటిరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల పేర్లు ప్రస్తావించారు. ఇలా ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు ఉన్నవారు చాలా మంది ఉన్నారన్నారు. అటువంటప్పుడు తన కుమారుడు ఎంపీ అయితే జూబ్లీ బైపోల్ లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయన్న అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాతోనే ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఇంటింటి ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anjankumar-express-confidene-og-getting-congress-ticket-in-jublee-bypoll-fires-39-207351.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.