ఖజానా నిల్.. ఉద్యోగుల డీఏ చెల్లింపులు బంద్! ఏపీ ఫ్యూచరేంటో? 

Publish Date:Nov 7, 2020

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రాష్ట్ర ఖజానాలో పైసా కూడా లేని పరిస్థితి వచ్చింది. కనీసం ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏను కూడా చెల్లించలేని హీన దుస్థితికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్. రెండు రోజుల క్రితమే ఉద్యోగులకు డీఏ ప్రకటించింది జగన్ సర్కార్. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. జనవరి 1, 2020 నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన  డీఏ అదనపు వాయిదా చెల్లింపులూ ఆపేసింది. జనవరి 1, 2020 నుంచి జూన్‌ 30, 2021 వరకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదని తేల్చేసింది ఏపీ ప్రభుత్వం. 
                                  

ఉద్యోగుల డీఏ చెల్లింపులు వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. తమపై విమర్శలు రాకుండా తెలివిగా వ్యవహరించింది. ఆ నెపాన్ని కేంద్రంపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కోవిడ్ , లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది. ఇదే కారణం చూపుతూ జగన్ సర్కార్ కూడా ఉద్యోగుల చెల్లింపుల నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చెల్లింపులు వాయిదా వేస్తూ తాజాగా ఇచ్చిన జీవోలో కేంద్రం నిర్ణయాన్ని కూడా పొందుపరిచింది. రాష్ట్రం కూడా అదే  పరిస్థితుల్లో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

 

ఏపీ ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం డీఏ  27. 248 నుంచి 30.392కు పెరిగింది. 2021 జనవరి జీతాలతో కలిపి క్యాష్ రూపంలో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018 జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు మొత్తం 30 నెలల బకాయిల్ని  3 సమభాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామని జీవోలోనే పేర్కొంది. సీపీఎస్ వారికైతే 30 నెలల ఎరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10 శాతం పాన్ అక్కౌంట్ కు జనవరి జీతాల చెల్లింపు అనంతరం అంటే 3 సమాన భాగాల్లో జమ చేస్తామని వివరించింది. ప్రభుత్వ ప్రకటనతో సంతోషించిన ఉద్యోగులకు కొన్నిగంటల్లోనే నిరాశ మిగిల్చింది జగన్ సర్కార్.  

 

డీఏ చెల్లింపులు వాయిదా వేస్తూ సర్కార్ ఇచ్చిన తాజా జీవోపై ఏపీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. రెండేళ్లుగా పెండింగ్ ఉన్న బకాయిలను మళ్లీ వాయిదా వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు డీఏ ఇవ్వలేని పరిస్థితికి ఏపీ దిగజారిపోయిందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం జీవో ఇచ్చినప్పుడు  కేంద్రం నిర్ణయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు, ఉద్యోగులకు ప్రకటించిన జీవో 3.114 శాతం. డీఏగా ప్రభుత్వం అదనంగా ఇచ్చే డబ్బులు వందల కోట్లలోనే ఉంటాయని చెబుతున్నారు. అలాంటి వందల కోట్ల రూపాయలు కూడా చెల్లంచలేక సర్కార్ చేతులెత్తేస్తే.. రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదనే ఆందోళన ఉద్యోగులు, జనాల్లో వ్యక్తమవుతోంది. 

 

మరోవైపు నవంబర్ నెలలో వారం రోజులు గడిచినా.. ఏపీలోని ఇంకా  40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందలేదని తెలుస్తోంది.  రాష్ట్ర ఖజానాలో నికధులు లేకపోవడంతో  ఆర్థికశాఖ ఏం చేయలేని పరిసత్థిలో ఉంది. కొవిడ్‌ విధుల కోసం నాలుగు నెలల క్రితం కొత్తగా భర్తీ చేసుకున్న వైద్యులు ఇప్పటి వరకు  నెల జీతమూ కూడా తీసుకోలేదట. రాష్ట్రానికి అప్పుల సమీకరణకు ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోవడంతో ఈ గండం తలెత్తిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

 

ఆర్థిక గండం నుంచి గట్టెక్కేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అప్పుల కోసం బ్యాంకులతో ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. గురువారం సచివాలయంలో ఐదు బ్యాంకులతో ఆర్థికశాఖ అధికారులు అప్పుల కోసం చర్చలు జరిపారు. తక్షణమే రూ. 6,000 వేల కోట్లు అప్పు కావాలని బ్యాంకర్లను కోరగా..  ప్రస్తుతం ప్రభుత్వానికి గ్యారంటీ స్పేస్‌ రూ. 6000 కోట్లు మాత్రమే ఉండడంతో .. ఆ ఐదు  బ్యాంకులు కలిసి ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది.  ఖజానాలో ఆ నిధులు జమ కాగానే పెన్షనర్లకు, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వలాని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సోమవారం వరకూ ఇది జరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

 

జగన్ సర్కార్ అస్తవ్యస్థ విధానాల వల్లే ఏపీ ఖజానా ఖాశీ అయిందని జనాలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక నియంత్రణ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం వల్లే గడ్డు పరిస్థితులు వచ్చాయంటున్నారు ఆర్థిక శాఖ నిపుణులు. జగన్ ప్రభుత్వం జవాబుదారి తనం లేకుండా ముందుకు వెళుతుందని, అడ్డగోలుగా నిధులు ఖర్చు చేస్తుందనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. తమ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రజల్లో క్రేజీ పొందాలనే ఉద్దేశ్యంతో అవసరం లేని వాటికి భారీగా నిధులు ఖర్చు  చేస్తూ.. అత్యంత కీలకమైన వాటిని విస్మరిస్తున్నారని చెబుతున్నారు. ఖజానా ఖాళీ అయిందంటే రాష్ట్రం దివాళా తీసినట్టేనని వారు  చెందుతున్నారు. ఏ ప్రభుత్వానికికైనా ఆర్థిక నిర్వహణే అతి ముఖ్యమైన,, అది గాడి తప్పిదే తలెత్త పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితి రావడం కలవరం కల్గించే విషయమని చెబుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.