కాంగ్రెస్‌వి దిక్కుమాలిన రాజకీయాలు

Publish Date:May 25, 2015

Advertisement



తెలుగు రాష్ట్రాల ప్రజలు తరిమి కొట్టినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఆ పార్టీ నాయకులు దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానలేదు. అడ్డగోలు విభజన కారణంగా దారుణంగా మోసపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ప్రత్యేక హోదా మీద తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రత్యేక హోదా లభించినట్టయితే ఆంధ్రప్రదేశ్‌కి ఊరటగా వుంటుంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడటానికి ఒక మార్గం దొరికినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు, ప్రభుత్వం ఈ ప్రయత్నాల్లో వుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ విషయంలో దిక్కుమాలిన రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు.

ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు కీలకమైన అంశం. ఏపీకి ప్రత్యేక హోదా రావడం వల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేది ఊహాజనితమైన అంశమే తప్ప మరేదీ కాదు. ఏ రాష్ట్రంలోని నాయకులైనా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగవచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని అనడం మాత్రం న్యాయం కాదు. కాంగ్రెస్‌కి చెందిన తెలంగాణ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ మధ్య కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరాదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందనేది ఆ లేఖ సారాంశం. పైగా లేఖ రాసిన తర్వాత ఆయన సదరు లేఖను తాను వ్యక్తిగతంగా రాశానని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

ఇలా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆంధ్రకు మంటపెట్టే లేఖ రాయగానే, ఏపీ కాంగ్రెస్ నాయకులు కస్సుమంటూ లేచారు. గుత్తా ఇలా లేఖ రాయడం అన్యాయం, అక్రమం, దారుణం అంటూ ఆవేశపడిపోయారు. ఇప్పటికే ఏపీలో సర్వనాశనమైపోయిన పార్టీని తిరిగి నిలబెట్టడానికి తాము నిద్రాహారాలు మాని ప్రయత్నిస్తుంటే గుత్తా ఇలాంటి లేఖలు రాయడం అన్యాయమని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ, ఏపీ నాయకులు ఇస్తున్న ఈ రాజకీయ కటింగులు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని అనడం ద్వారా తెలంగాణలో ప్రజల మెప్పు పొందాలని గుత్తాగారు ప్రయత్నిస్తారు. గుత్తా మాటలను ఖండించి ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఏపీ కాంగ్రెస్ నాయకులు ఏపీ ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వున్న ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించే దిక్కుమాలిన రాజకీయాల నమూనా అని ప్రజలు అంటున్నారు.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.