వారి దారులు వేరయినా గమ్యం ఒక్కటే...రాష్ట్రాభివృద్ధి!

Publish Date:Mar 13, 2015

Advertisement

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు కేసీఆర్ ఇరువురు తమ తమ రాష్ట్రాల అభివృద్ధికి విభిన్న మార్గాలను ఎంచుకొన్నట్లు వారి ప్రభుత్వ కార్య ప్రణాళికలను గమనిస్తే అర్ధమవుతుంది. తెలంగాణాలో భూములు అంత సారవంతమయినవి కావు. పైగా వాటికి నీటి సదుపాయం కూడా లేదు. దానికి తోడు రాష్ట్రంలో విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఈ సమస్యల కారణంగా 65 శాతం గ్రామాలు పేదరికంతో బాధపడుతున్నాయి.

 

ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పధకాలను అమలుచేస్తున్నారు. తద్వారా విద్యుత్ సరఫరాతో సంబంధం లేకుండా గ్రామాలకు త్రాగునీరు, పంటలకు సాగునీరు అందుతుంది. ఒకసారి చెరువులు నిండితే భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అదేవిధంగా చెరువులలో తీసిన అత్యంత పోషక విలువలున్న పూడిక మట్టిని పంట భూములపై వేసుకొన్నట్లయితే భూమిలో సారం కూడా పెరుగుతుంది. చెరువులు నిండి పంటలకు సకాలంలో నీళ్ళు అందుతుంటే పంటలు కూడా పండుతాయి. తద్వారా క్రమంగా పేదరికం కూడా తగ్గుతుంది. ఈవిధంగా బహుళ ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే నాలుగేళ్లలో తెలంగాణా రాష్ట్రంలో స్పష్టమయిన అభివృద్ధి కనబడటం తధ్యం. బహుశః కేసీఆర్ చేప్పట్టిన ఈ ప్రాజెక్టు యావత్ దేశానికి ప్రేరణ కలిగించినా ఆశ్చర్యం లేదు. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రాజెక్టుని రాష్ట్రంలో అమలు చేసేందుకు ఇప్పటి నుండే ప్రయత్నిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి.

 

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐ.టి, విద్య, స్కిల్ డెవెలప్ మెంట్, పారిశ్రామిక, వాణిజ్య, మౌలికవసతులపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లున్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం కూడా అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొన్నారు. ఆయన అనుకొన్నట్లుగా వచ్చే నాలుగేళ్లలో రాజధాని నగరానికి ఒక రూపు రేఖలు తీసుకురాగలిగి, పైన పేర్కొన్న అన్ని రంగాలలో అభివృద్ధి చేయగలిగితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలంగాణా కంటే మెరుగయ్యే అవకాశం ఉంది.

 

రాష్ట్రానికి సువిశాలమయిన సముద్రతీరం ఉంది. కనుక కొత్తగా పోర్టులను నిర్మించి వాటిని రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో అనుసంధానం చేసే విధంగా విశాలమయిన రోడ్లు నిర్మించడం ద్వారా వ్యాపార కార్యక్రమాలు పెరిగి రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

 

అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సారవంతమయిన భూములున్నాయి. వాటికి సాగునీరు అందించడానికి కూడా ప్రభుత్వం అనేక పధకాలు సిద్దం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగినట్లయితే రాజధాని నిర్మాణం వలన 40,000 ఎకరాలలో కోల్పోతున్న పంట దిగుబడి ఇతర ప్రాంతాలలో తిరిగి సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈలోగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా కూడా దిగుబడి పెంచి సమతుల్యం సాధించాలని భావిస్తున్నారు.

 

ఈ విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాభివృద్ధికి విభిన్న మార్గాలు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వచ్చేఎన్నికల నాటికి ఇరు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి వారి చిత్తశుద్ధికి, సమర్ధతకు గీటురాయిగా నిలుస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.