అమరావతికి మరో అన్యాయం.. ఎక్స్‌ప్రెస్‌-వే నుంచి ఔట్‌..!

Publish Date:Mar 4, 2020

Advertisement

విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్న జగన్ ప్రభుత్వం... అమరావతి అభివృద్ధి మాత్రం ఆగదని చెప్పుకొచ్చింది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అయితే, అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ అమరావతికి తీవ్ర అన్యాయం చేస్తోంది జగన్ ప్రభుత్వం. అమరావతికి ఎలాంటి అన్యాయం చేయబోమంటూనే చేయాల్సిన నష్టం చేస్తున్నారు. ఇప్పటికే, మూడు రాజధానుల పేరిట సచివాలయాన్ని విశాఖకు... హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం... అమరావతిలో అభివృద్ధి పనులను సైతం నిలిపివేస్తోంది. అమరావతిలో అనేక నిర్మాణాలను నిలిపివేసిన సర్కారు... ఇప్పుడు, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అనంతపురం-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నుంచి అమరావతిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ సాకుల పేరుతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా భూసేకరణ భారంగా మారిందని, రహదారిని అమరావతి వరకు తీసుకెళ్లలేమని, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకే పరిమితం చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, అప్పడది అనంతపురం-చిలుకలూరిపేట ఎక్స్ ప్రెస్ వేగా మాత్రమే మిగిలిపోతోంది. దాంతో అమరావతికి తీవ్ర అన్యాయం జరుగుతుంది.

అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో భూసేకరణ కష్టంగా మారిందని, ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని అధికారులు నివేదించంతో, దాన్ని సాకుగా తీసుకున్న ప్రభుత్వం... అలైన్‌మెంట్‌ మార్చాలని, చిలకలూరిపేట వరకే రహదారి అనుసంధానం చేయాలని, ఆపై వద్దని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది. చిలకలూరిపేట మీదుగా ఎన్‌హెచ్‌-16 వెళ్తోంది. ప్రతిపాదిత ఎక్స్ ప్రెస్ వేను అక్కడ నిర్మిస్తున్న బైపాస్ కు కలపాలని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. అక్కడ్నుంచి గుంటూరు, విజయవాడకు ఎలాగూ... హైవే ఉన్నందున, దానికి సమాంతంగా మరో పెద్ద రహదారి నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతపురం ఎక్స్ ప్రెస్ ను చిలకలూరిపేట బైపాస్ కు కలిపితే, రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు అక్కడ్నుంచి నేరుగా ఎన్ హెచ్ -16 ద్వారా విశాఖ వెళ్లడానికి వీలుగా ఉంటుందన్న కోణంలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు.

అయితే, కేంద్రం ఆమోదించిన ఆర్వోడబ్ల్యూ ప్రకారం అనంతపురం జిల్లా మర్రూరు నుంచి చిలకలూరిపేట, ప్రత్తిపాడు, ఫిరంగిపురం ప్రాంతాల నుంచి తాడికొండ మండలం పెద్దపరిమి దాకా రహదారిని నిర్మించాల్సి ఉంది. ఇందులో కర్నూలు, కడప నుంచి కలిసే రహదారులను మినహాయిస్తే కొత్తగా నిర్మించేది 394 కిలోమీటర్లు. అయితే, ఈ 394 కిలోమీటర్ల రహదారికి ముందుగానే ఎంత భూమి అవసరమవుతుందో అంచనా వేశారు. 28వేల ఎకరాలు అవసరమవుతుందన్న అంచనాతో ఒక్క భూసేకరణకే 2వేల 500కోట్లు వ్యయమవుతుందని లెక్కవేశారు. ఒకవేళ భూసేకరణ ఖరీదైన ప్రక్రియగా మారితే అదనంగా మరో 500కోట్లు అవసరమవుతాయని అప్పుడే అంచనా వేశారు. అయితే, ఇప్పుడు, భూసేకరణ భారం మారిందన్న సాకుతో అమరావతి వరకు ఎక్స్ ప్రెస్ వే రాకుండా మధ్యలోనే నిలిపివేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

అమరావతి కోసం పెద్దఎత్తున పోరాడుతోన్న రైతాంగానికి, అక్కడి ప్రజలకు ఇది మరింత ఆగ్రహం తెప్పించే నిర్ణయంగా కనిపిస్తోంది. పాతిక వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి నుంచి అమరావతిని తొలగిస్తూ జగన్ ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు. ఇంకా, రాజధానిని తరలించకముందే, కీలక ప్రాజెక్టు నుంచి అమరావతిని తొలగించడమేంటని అమరావతి వాసులు ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.