ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాలలో ఒకటి అన్నది నిస్సందేహం. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ సాక్షాత్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ప్రమాద కోణంపై దర్యాప్తునకు సీబీఐ విచారణకు ఆదేశించడమూ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన ప్రతి సారీ రైల్వే శాఖ కుట్ర కోణం ఉందని చెప్పడం పరిపాటిగా మారిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ కుట్ర కోణానికి మతపరమైన మసాలా జోడించి దేశంలో విద్వేషాలు రగిలేలా సామాజిక మాధ్యమంలో పోస్టుల వెనుకే నిజమైన కుట్ర ఉందని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
రెండు రైల్వే పోలీసు డిస్ట్రిక్ట్స్ కు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీసు అదనపు డీజీపీగా పని చేసిన అనుభవం ఉన్న నాగేశ్వరరావు మరో ట్వీట్ లో ఎప్పుడు రైలు ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదం వెనుక ఉన్నరైల్వే వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలచ్చడానికి, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రైల్వే అధికారులు వ్యూహాత్మకంగా ‘కుట్ర’ జరిగిందంటూ ప్రకటనలు గుప్పించడం పరిపాటేనని పేర్కొన్నారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత కాలంగా విజయవంతంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. ప్రస్తతం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై సామాజిక మాధ్యమంలో విద్వేషం పెచ్చరిల్లేలా వస్తున్న వార్తల నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆయన వ్యాఖ్యలు రైల్వే శాఖనే కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నట్లుగా ఉండటంతో ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును తప్పుపడుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రమాదానికి కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అంతే కానీ దర్యాప్తుల పేరుతో కాలయాపన జరపడం తగదని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కేసును అప్పగించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. అలాగే మల్లికార్జున్ ఖర్గు ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి.. దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. సిబ్బంది కొరత, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వైఫల్యం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/after-every-accident-railway-says-it-is-conspiracy-39-156402.html
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.