రాయలసీమలో వైసీపీ ఖాళీ.. జనసేన వ్యూహం అదేనా?

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.  ముఖ్యంగా  రాయలసీమ పరిధిలోని ఉమ్మడి ఆరు జిల్లాలలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోంది. ఇందుకు కారణం ఈ ప్రాంతంపై  పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించడమే అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే జనసేన  ఆపరేషన్ ఆకర్ష్‌ కు తెరలేపి.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే.. తాజాగా  జనసేనలోకి  చేరికలను సమీక్షించడానికి 14 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి చేరికల కమిటీని జనసేనాని ఏర్పాటు చేశారు.   ఈ కమిటీలో ఇటీవలే వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి  కీలకమైన బాధ్యతలను అప్పగించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రాజకీయాలపై బాలినేనికి ఉన్న పట్టును ఉపయోగించుకుని..  ఆయా జిల్లాలలో వైసీపీ అసంతృప్తి నేతలను జనసేనలోకి ఆకర్షించాలన్న వ్యూహంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల నుంచి కనీసం  పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకు వైసీపీ ద్వితీయ శ్రేణి, అలాగే పది మంది వరకూ సీనియర్, కీలక వైసీపీ నేతలు జనసేనలోకి చేరుందుకు ఇప్పటికే మాటాముచ్చటా జరిగిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని తెలుస్తోంది.  గత ఎన్నికలలో కేవలం కొన్ని స్థానాలకే పరిమితమైనప్పటికీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోయిన జనసేనకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడినికీ, మరీ ముఖ్యంగా రాయలసీమలో పాగా వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని చెబుతున్నారు. ఓటమి తరువాత వైసీపీలో నైరాశ్యం కమ్ముకుంది. అటు క్యాడర్, ఇటు లీడర్ కూడా పెద్దగా యాక్టివ్ గా ఉంటున్న దాఖలాలు కనిపించడంలేదు. 

దీంతో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో పడ్డ వైసీపీ నేతలు, పార్టీ వీడే యోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలోచర్చ జరుగుతోంది. అలా పార్టీని వీడాలనుకునే వారికి ఉన్న ఆప్షన్లు తెలుగుదేశం, జనసేన మాత్రమే. అయితే తెలుగుదేశంలో చేరికకు అవకాశం లభించినా, అక్కడ ఇప్పటికే సీనియర్లు చాలా మంది ఉండటంతో తమకు సముచిత స్థానం లభించే విషయంలో అనుమానాలు ఉన్న వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా పార్టీలోకి చేరికలకు పచ్చ జెండా ఊపారు.  

Pawan Kalyan, Balineni Srinivasa Reddy, Greater Rayalaseema, YSRCP Leaders, Telugu One

By
en-us Political News

  
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.