ఏపీ మద్యం కుంభకోణం.. ఏ9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అరెస్టు.!

Publish Date:Aug 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  మద్యం కుంభకోణం కేసులో  కీలక పరిణామం చోటు చేసుకుంది.  వైసీపీ హయాంలో జరిగిన ఈ భారీ మద్యం కుంభకోణంలో నిందితుడైన  ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్  సోమవారం (ఆగస్టు 3) రాత్రి  హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించింది. మద్యం వ్యాపారంలో వచ్చిన కోట్లాది  రూపాయల ముడుపుల సొమ్మును  దారి మళ్లించేందుకు  డొల్ల కంపెనీలను సృష్టించడంలో కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించాడని సిట్ ఆరోపిస్తోంది.

ఃఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మద్యం కుంభకోణం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయగానే అరెస్టు భయంతో కిరణ్ కుమార్ రెడ్డి 2024 నవంబర్ లోనే   దుబాయ్ పారిపోయాడు. దీంతో అధికారులు కిరణ్ కుమార్ రెడ్డిపై  లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది. 

అయితే ఈ కేసులో పలువురు అరెస్టు కావడం, సుదీర్ఘ కాలం విదేశాలలో తలదాచుకోవడం సాధ్యం కాకపోవడంతో.. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  ఆ యాంటిసిపేటరీ బెయిలు కొట్టివేసిన సుప్రీం కోర్టు తక్షణమే  లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో గత్యంతరం లేక.. కిరణ్ కుమార్ రెడ్డి..  దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం (ఆగస్టు 3) చేరుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో.. శంషాబాద్ విమానాశ్రయ ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను గుర్తించి అదుపులోనికి తీసుకుని సిట్ కు సమాచారం అందించారు.  వెంటనే హైదరాబాద్ నుంచి సిట్ ప్రత్యేక బృందం కిరణ్ కుమార్ రెడ్డిని తమ అదుపులోనికి తీసుకుని విజయవాడ తరలించింది. మంగళవారం (ఆగస్టు 4) కిరణ్ కుమార్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు.  

Kiran Kumar Reddy Arrested, IIT Kharagpur Liquor Scam, Shamshabad Airport SIT Arrest

By
en-us Political News

  
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
 ఈ సోదాలు బీహార్ కు  చెందిన ప్రత్యేక ఈడీ బృందం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్,  విశాఖలో మళ్ల విజయప్రసాద్ కు చెందిన  నివాసాలు, వ్యాపార ప్రాంగణాలు,   అనుబంధ కార్యాలయాలలో ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు. 
దాడికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సేకరించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా పంజాబ్‌లోని కీలకమైన పోలీస్ స్టేషన్లు, పోలీస్ భవనాలు, సిబ్బందిపై నిరంతరం రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ నిందితులకే అప్పగించారు. మరోవైపు అమృత్‌సర్ ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చిన వ్యవహారంపై తనిఖీలు చేపట్టగా రెండో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది.
947లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన ఇండియా.. ఈ ఏడాది 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాసచుసెట్స్ లో పంద్రాగస్టును ఇండియా డేగా జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు
మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై  మంగళవారం ) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం  అంపోలు జైలుకు తిరిగి తరలించారు.
హర్మూజ్ జలసంధి మూతపడలేదని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గం సురక్షితంగా తెరిచే ఉందని ప్రకటించింది. అమెరికా బలగాలు ఈ మార్గంలో నౌకల రక్షణ కోసం నిరంతరం పహారా కాస్తున్నాయని పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.