ముగిసిన మాజీ మంత్రి అప్పలరాజు పోలీసు కస్టడీ.!

Publish Date:Aug 5, 2026

Advertisement

గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో  అరెస్టై రిమాండ్ లో ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతిపై  మంగళవారం (ఆగస్టు 4) ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు కస్టడీ గడువు ముగియడంతో అదే రోజు సాయంతరం  అంపోలు జైలుకు తిరిగి తరలించారు. సీదిరి అప్పలరాజు కుమారుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారకుడైన కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికీ, పోలీసులను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించారంటూ సీదిరి అప్పలరాజు  ఈ కేసులో పోలీసులు ఏ3గా నిందితుడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   

రిమాండ్ లో ఉన్న అప్పలరాజును కోర్టు  ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో   శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజును మంగళవారం (ఆగస్టు 4)  కట్టుదిట్టమైన భద్రత నడుమ కాశీబుగ్గ స్టేషన్‌కు తరలించి  నాలుగు గంటల పాటు విచారించారు.     దానయ్య   మృతికి దారితీసిన రోడ్డు ప్రమాద  ఘటన ఎప్పుడు జరిగింది,

ప్రమాదం జరిగిన సమయంలో అప్పలరాజు ఎక్కడ ఉన్నారు, ఘటన స్థలానికి ఆయన ఎంత సమయానికి చేరుకున్నారు తదితర అంశాలపై పోలీసులు ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది.  కోర్టు విధించిన 1 రోజు పోలీస్ కస్టడీ గడువు  పూర్తి కావడంతో, పోలీసులు   ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి,  పోలీసు బందోబస్తు మధ్య తిరిగి  అంపోలు జైలుకు తరలించారు.  

Seediri Appalaraju, Kasibugga Police Station, Danayya death case, Police custody, Ampolu Jail Srikakulam,  former minister

By
en-us Political News

  
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి కారు పేరుతో కలకలం..!
వాహన యజమానులు   సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం,  దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.