Publish Date:Jun 17, 2026
హైదరాబాద్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న 16 నెలల చిన్నారి క్షణాల్లోనే విషాదానికి గురైంది. ప్రమాదవశాత్తు బాత్రూమ్లోని నీటి బకెట్లో పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్బాబా నగర్ సీ-బ్లాక్లో మహ్మద్ ఆసిఫ్ ఖాన్, హబీబా ఉన్నీసా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆయత్ ఖాన్ అనే 16 నెలల కుమార్తె ఉంది.
ఇటీవల కుటుంబ సభ్యులంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, ఈ ఘటన అక్కడే చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం పాపకు స్నానం చేయించిన తల్లి, ఇతర పిల్లలతో ఆడుకోవడానికి వదిలి తన పనుల్లో నిమగ్నమైంది. ఈ సమయంలో అందరి దృష్టి తప్పించుకుని చిన్నారి బాత్రూమ్లోకి వెళ్లింది.
కొద్దిసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, నీటితో నిండిన బకెట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి షాక్కు గురయ్యారు. వెంటనే ఆమెను చంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక మంగళవారం చిన్నారి మృతి చెందింది.
ఈ ఘటనపై కంచన్బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్షణాల నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నీటితో నిండిన బకెట్లు, టబ్బులు వంటి వాటిని ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్న జాగ్రత్తే పెద్ద ప్రమాదాన్ని నివారించగలదని హెచ్చరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/16monthold-baby-dies-after-falling-into-bucket-of-water-36-223267.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే