24 గంటలు.. 12 అత్యాచారాలు.. తమిళనాట ప్రభుత్వం ఉందా?

Publish Date:Jun 17, 2026

Advertisement

తమిళనాడు ఒకప్పుడు దేశంలోనే మహిళల రక్షణకు, శాంతిభద్రతలకు మారుపేరుగా నిలిచింది. శాంతి భద్రతల విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలో కానీ తమిళనాడు దేశానికి ఆదర్శవంతంగా ఉండేది. అయితే  గడిచిన కొన్నేళ్లుగా అక్కడ  పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో   కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 12 లైంగిక దాడి కేసులు నమోదు అయ్యాయి.  

శాంతిభద్రతలకు నిలయంగా భావించే చెన్నై నగర పరిధిలోనే ఈ ఘోరాలన్నీ చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.   నమోదు అయిన కేసుల్లో ఒకటి మూడు సంవత్సరాల చిన్నారిపై   హత్యాచారం. అలాగే.. మరో ఏడుగురు మైనర్ బాలికలపై కూడా లైంగిక దాడులు జరిగాయి.  అంటే మొత్తం కే12 కేసుల్లో ఎనిమిది  మైనర్ బాలికలపై జరిగిన లైంగిక దాడులే కావడం  ఈ నేరాల తీవ్రతను తెలియజేస్తున్నది.  నగరంలో మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని చెప్పడానికి  24 గంటల వ్యవధిలో 12లైంగిక దాడుల కేసులు నమోదు కావడమే నిదర్శనం. 

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం నడుస్తోంది. నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారి  ఇటీవలె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్  ఇప్పుడు రాష్ట్రంలో, రాష్ట్ర రాజధానిలో పెరిగిపోయిన ఈ నేర సంస్కృతిని ఎలా అరికడతారన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. నేరాలను అరికట్డడం, మహిళా భద్రత విషయంలో రాష్ట్రం, చెన్నై నగరాన్ని సురక్షితం అన్న విశ్వాసాన్ని పాదుగొలపడం, ఆయన పాలనకు, పాలనా దక్షతకు ఒక పరీక్షగా మారిందనడంలో సందేహం లేదు.  కేవలం ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై, పోలీసు యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

సోషల్ మీడియా వేదికగా నెటిజనులు సీఎం విజయ్ స్పందనను, కఠిన చర్యలను డిమాండ్  చేస్తున్నారు.   ఇలాంటి మృగాళ్లపై   సాధారణ చట్టపరమైన చర్యలు సరిపోవని, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   శాంతిభద్రతల పరిరక్షణలో  ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా కనబడుతోంది.   

By
en-us Political News

  
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ను ఎ–11 నిందితుడిగా పేర్కొన్నారు.
రకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు. దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సింధు జలాల వివాదాన్ని రాజకీయం చేస్తూ యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో ఒక భాగమని, అవసరమైతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తాము కొట్టిపారేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఈ ప్రమాదంలో కనీసం 60 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల విధులు నిర్వహిస్తున్న మరో 18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా వంటి తమ మిత్రపక్ష సాయుధ గ్రూపులను ఇరాన్ వెంటనే నియంత్రించకపోతే, ఆ దేశంపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన బాంబు దాడులు, సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చర్చల హాల్‌లోకి చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ చేసిన తీవ్రమైన బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు, ర రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి.
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం నాడు ఒక భారీ పారిశ్రామిక దుర్ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.