Publish Date:Jun 23, 2025
జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. విష ప్రయోగాలకు జగన్ సర్కార్ విద్యారంగాన్ని వాడుకుంది. సంక్షుమ పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం వినా జగన్ రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి చేసిందంటూ ఏమీ లేని పరిస్థిది. జగన్ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ దాదాపు కుప్ప కూలిపోయిన పరిస్థితి. అమ్మఒడి అంటూ పథకాన్ని ప్రవేశ పెట్టినా దానిలో కోతలు.
ప్రస్తుత తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యావ్యవస్థ ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ బలో పేతమైంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాల్లో సీట్లు వందశాతం భర్తీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల మాదిరి ప్రభుత్వ విద్యా సంస్థలలోనూ అడ్మిషన్ల్స కంప్లీటడ్ , సీట్స్ ఫిల్, అడ్మిషన్స్ క్లోజ్ డ్ అన్న బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి. టెక్కలి, నెల్లూరు ఇలా చోట్ల సీట్స్ కంప్లీటడ్ అన్న బోర్డులు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతమౌతోందనడానికి నిదర్శనమిదిగో అని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అంత లేలికగా ఏమీ రాలేదు.
గత ఏడాది సార్వత్రి ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం తెలుగుదేశం కూటమి సర్కార్ విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టారు. పాఠశాలలలో టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. పాఠశాలల రూపురేకలు మార్చే విధంగా చర్యలు చేపట్టారు. ఆ కృషి ఫలితాలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ప్రజలలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతుందన్న నమ్మకం విద్యార్థలు తల్లిదండ్రులలో ఏర్పడింది. దీంతో ప్రస్తత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల స్ట్రెంగ్త్ అనూహ్యంగా పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. దాని ఫలితమే పలు స్కూళ్లల్లో విద్యా సంవత్సరం ప్రారంభమ్యే సరిగే సీట్లు భర్తీ అయిపోవడం. రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం సర్కారీ బడుల్లో అడ్మిషన్ల ప్రారంభం నాటికే 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయిపోయాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/100-percent-admissions-in-government-schools-39-200473.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.