జగన్మోహన్ రెడ్డికి 2014లో అధికారమా? గడ్డు కాలమా?

Publish Date:Dec 30, 2013

Advertisement

 

వచ్చేఎన్నికలు యూపీయే, ఎన్డీయే కూటములకు ఎంత కీలకమయినవో, అదేవిధంగా రాష్ట్రంలో తెదేపా, వైకాపాల కూడా జీవన్మరణ పోరాటం వంటివని చెప్పవచ్చును. కనుక చంద్రబాబు ఈసారి ఎలాగయినా తెదేపాను గెలిపించుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఇక వైకాపాకి కూడా ఈ ఎన్నికలు నిజంగానే జీవన్మరణ పోరాటం వంటివని చెప్పవచ్చును. ఎన్నికలలో గెలిస్తే పరువాలేదు. కానీ ఓడిపోతే మాత్రం అంతవరకు నిద్రావస్థలో ఉంచబడిన చార్జ్ షీట్లు, కేసులు అన్నీఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి జైలుకి తీసుకుపోవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కాకపోయినా కనీసం కేసులనుండి బయటపడేందుకయినా వైకాపా తప్పనిసరిగా గెలవవలసి ఉంటుంది.

 

తమకూ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అక్రమ సంబంధమూ లేదని వాదిస్తున్నజగన్మోహన్ రెడ్డి, నిజానికి కేంద్రంలో కాంగ్రెస్ గనుక అధికారంలోకి రాలేనట్లయితే చాలా చిక్కుల్లోపడతారు. అందువల్ల ఇక్కడ రాష్ట్రంలో తన గెలుపు ఎంత ముఖ్యమో, కేంద్రంలో యూపీయే గెలుపు కూడా ఆయనకు అంతే ముఖ్యం. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికార పగ్గాలు చేపడితే జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం మొదలయినట్లే. జగన్ తన పార్టీని గెలిపించుకొని కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేకి మద్దతు ఇవ్వడం అత్యంత అవసరం. అప్పుడే అతను కేసుల నుండి బయటపడగలరు. ఈ సంగతి జగన్ కంటే కాంగ్రెస్ అధిష్టానానికి బాగా తెలుసు గనుకనే జగన్ పట్ల అంత నమ్మకం పెట్టుకొని స్వంత పార్టీ నేతలకు కూడా హ్యాండిస్తోంది.

 

ఇక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాదిస్తున్నజగన్మోహన్ రెడ్డికి, ఒకవేళ నిజంగా ఎన్నికల సమాయానికి రాష్ట్ర విభజన గనుక జరుగకపోయినట్లయితే తెలంగాణా వదులుకొని బయటకి వచ్చినందుకు వైకాపాకు తీరని నష్టం కలగడం తధ్యం. అదీగాక సమైక్య రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో సమైక్యాంధ్ర సెంటిమెంటు వాడుకొని లబ్దిపొండడం కష్టం. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తీవ్రమయిన పోటీ ఉంటుంది గనుక, ఎవరికీ మెజార్టీ రానట్లయితే అది వైకాపాకు ఓటమితో సమానమే అవుతుంది. 

 

ఇక రాష్ట్రంలో తెదేపా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డికి గడ్డు రోజులు ముంచుకు వచ్చినట్లే. చంద్రబాబు, నరేంద్రమోడీ ఇద్దరూ ఇంచుమించు ఒకేరకమయిన ఆలోచనా ధోరణి కలవారు. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తనపై సీబీఐని ఉసిగొల్పి కక్ష సాధినందుకు, మోడీ ప్రధాని పదవి చెప్పటిన తరువాత, అదే సీబీఐని కాంగ్రెస్ పై ప్రయోగించడం ఖాయం.తెదేపా, బీజేపీలు ఇప్పటికే సూత్రప్రాయంగా ఎన్నికల పొత్తులకు అంగీకరించ్నట్లు కనబడుతున్నాయి. అందువల్ల ఎన్నికల ముందు తరువాత కూడా వైకాపాను బీజేపీ దూరంగా ఉంచడం సహజమే. ఇక బ్రదర్ అనిల్ పై రాష్ట్ర బీజేపీ నేతలు చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. అందువల్ల వారు కూడా వైకాపాను దూరంగా ఉంచే ప్రయత్నం చేయడమే కాక, ఎన్నికల అనంతరం అనిల్, జగన్మోహన్ రెడ్డిలపై చర్యలకు పూర్తి మద్దతు ఈయవచ్చును.

 

అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నఅన్ని కేసులను వేగవంతం చేయవచ్చును. చంద్రబాబు మోడీతో తనకున్నసాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డిపై ఈడీ గతంలో నమోదు చేసిన కేసులను కూడా బయటకు తీయించి విచారణ చేప్పట్టేలా చేయవచ్చును. అందువల్ల వచ్చేఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యవంటివేనని చెప్పవచ్చును. 

 

రాష్ట్రంలో తన గెలుపు ఎంత ముఖ్యమో, కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు కూడా ఆయనకు అంతే ముఖ్యం. అంటే రాష్ట్ర విభజనకు పూనుకొన్నకాంగ్రెస్ పార్టీతోనే ఎన్నికల తరువాత జగన్మోహన్ రెడ్డి చేతులు కలపబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఇదంతా కలిపి చూసినట్లయితే కాంగ్రెస్ అధిష్టానం ఇంత హడావుడిగా రాష్ట్ర విభజన చేయడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అవడం, రాష్ట్ర విభజనను జగన్ వ్యతిరేఖిస్తూ సీమాంధ్రలో తన పార్టీని బలోపేతం చేసుకోవడం అన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ లబ్ధికోసం ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నదేనని అర్ధం అవుతోంది. ఏమయినప్పటికీ, వచ్చే ఎన్నికలలో వైకాపా పూర్తి మెజార్టీతో గెలిస్తే పరిమిత కష్టాలు, ఓడిపోయినట్లయితే మళ్ళీ గడ్డు కాలం తప్పకపోవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.