పీవోకే ప్రధానినౌతా.. నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన.!

Publish Date:Jul 23, 2026

Advertisement

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాను పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధానిని అవుతానంటూ చేసిన ప్రకటన పాకిస్థాన్ లోనే కాకుండా యావత్ ప్రపంచ దేశాలలోనూ సంచలనం సృష్టించింది. ఆ ప్రకటన అన్ని విషయాలనూ అధిగమంచి ప్రపంచ వ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది.  సాధారణంగా   దేశ ప్రధానిగా  పని చేసిన  నాయకుడు ఎవరైనా సరే, ఆ తర్వాత ప్రాంతీయ లేదా స్థానిక పదవులను చేపట్టడానికి సుముఖత చూపరు. అటువంటిది  పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం  పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతానికి ప్రధాని కావాలని ఉందంటున్నారు. 

పాకిస్ధాన్ ప్రధానిగా మూడు సార్లు పని చేసిన నవాజ్ షరీఫ్..   వివాదాస్పద ఆక్రమిత ప్రాంతానికి ప్రధాని పదవి చేపట్టాలని భావించడం వెనుక  వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ నగరం వేదికగా జరిగిన భారీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన నవాజ్ షరీఫ్, అక్కడ తన పిఎమ్‌ఎల్-ఎన్  విజయం సాధిస్తే.. పీవోకే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని చెప్పారు. 

నవాజ్ షరీఫ్ ప్రకటనకు  పీఓకేలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థితులే కారణమంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు.   ప్రస్తుతం పీఓకేలో  ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, భరించలేని విద్యుత్ ఛార్జీలు,  వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా  ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ  ఆధ్వర్యంలో  లక్షల మంది రోడ్లపైకి వచ్చిఆందోళన చేస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి  పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధ చర్యలు, సైనిక బలగాల ఘర్షణల కారణంగా ఇప్పటివరకు అక్కడ పలువురు నిరసనకారులు అసువులు బాసారు.  దీంతో ప్రజలలో ఆగ్రహావేశాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఎ  ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆగ్రహ జ్వాలల నుంచి తప్పించుకుని, ఓటర్లను ఆకట్టుకోవడానికి నవాజ్ షరీఫ్ పీవోకే ప్రధాని ప్రకటన చేశారని అంటున్నారు.  

Nawaz Sharif PoK PM, Pakistan Occupied Kashmir, Shehbaz Sharif, Muzaffarabad Rally

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ కీలక అడుగు వేసింది.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తీవ్ర రూపం దాల్చింది.
నా నియోజకవర్గానికి జోలికి వస్తే మీకు మర్యాద దక్కదు.. ఘాటు హెచ్చరిక..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు ఈరోజు కేవలం నిరసనలకు వేదికగా మాత్రమే లేవు
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి ..పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
చివరికి మర్డర్ చేయించింది కూడా సవతి తల్లే..!
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది.
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి, తన తీర్పును ఈనెల 27కి రిజర్వ్ చేశారు.
ఢిల్లీలో ముగిసిన సీజేపీ రెండో విడత చర్చలు..!
ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణ మార్గంలో పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సరికొత్త విప్లవం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.