రాజ్ భవన్ కి ... మోత్కుపల్లి ఇంకెంత దూరం?
Publish Date:Sep 7, 2016
Advertisement
రాష్ట్ర విభజన తరువాత టీ టీడీపి గురించి మాట్తాడితే చాలు వినిపించే పేరు మోత్కుపల్లి నర్సింహులు! రేవంత్ రెడ్డితో పాటూ ఆయన తెలంగాణ టీడీపికి కష్ట కాలంలో అండగా నిలబడ్డాడు. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో తెలంగాణాలో గట్టిగా నిలబడిన టీడీపీ లీడర్లు చాలా తక్కువ మంది. వారిలో మోత్కుపల్లి అత్యంత ప్రముఖుడనే చెప్పాలి. అయితే ఆయన పార్టీ పట్ల చూపిన విధేయతకుగాను గవర్నర్ అవుతారని ఎప్పట్నుంచో టాక్... మోత్కుపల్లి గవర్నర్ అనే వార్త ఇప్పటికే చాలా సార్లు వచ్చింది. అసలు సోషల్ మీడియాలో అయితే టీడీపి అంటే పడని వారు, మోత్కుపల్లి ప్రత్యర్థులు ... దీనిపై అనేక సెటైర్లు వేస్తున్నారు. అయినా కూడా నిప్పు లేనిదే పొగరాదన్నట్టు గవర్నగిరి వార్తలు మాత్రం వస్తూనే వున్నాయి!
తెలంగాణ ఉద్యమ కాలంలో, తరువాత కూడా టీ టీడీపీ అనేక విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ తన దృష్టంతా టీడీపీ పైనే పెట్టింది. అటువంటి గడ్డు కాలంలో కూడా మోత్కుపల్లి పార్టీ జెండా వదలకుండా పోరాడాడు. ఎన్నో నిందలు కూడా భరించాడు. అందుకే, చంద్రబాబు ఆయనకు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ తో మాట్లాడి గవర్నర్ పదవి ఇప్పించాలని నిర్ణయించారు. కాని, ప్రత్యేక హోదా విషయంలో పదే పదే టీడీపీకి, ఎన్డీఏకి భేదాభేప్రాయాలు రావటంతో మోత్కుపల్లి ఇష్యూ కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు ప్రత్యేక హోదా కాస్తా ప్రత్యేక ప్యాకేజ్ గా రూపు మార్చుకుని గొడవ సద్దుమణిగేటట్టుగా వుంది!
ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ అయితే మోత్కుపల్లి గవర్నర్ అంశం కూడా ముందుకు కదులుతుందా? అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. ఇంతకాలం ఏపీకి రావాల్సిన వరాలపై తర్జభర్జన జరగటంతో తమ నేత ఆశలు కూడా డోలాయమానంలో పడ్డాయని, ఇప్పుడిక అలాంటిది వుండదని అంటున్నారు. చూడాలి మరి... మోత్కుపల్లి పార్టీ విధేయతకి, స్వామి భక్తికి గవర్నర్ పదవి నజరానాగా లభిస్తుందో లేదో...
http://www.teluguone.com/news/content/-ttdp-45-66172.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్లో ఏ చిన్న
ఉత్తర్ప్రదేశ్లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.
Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో ఆదాయపు శాఖ నోటీసులు జారీచేసింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా అనేక భూ కుంభకోణాలలో వినిపించింది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటం వలన ఈ కేసులేవీ వారిని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమవడంతో అవినీతిపరులకు గుండెల్లో గుబులు మొదలయింది.