సోంత ఇంట్లోనే బంగారం చోరీ.. ఇంటి దొంగను పట్టేసిన పోలీసులు

Publish Date:Apr 3, 2026

Advertisement

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు  అన్నది సామెత.. కానీ పోలీసులు అలాంటి దొంగను పట్టేశాడు.  ఓ యువకుడు జలసాలకు అలవాటు పడి తన ఇంట్లోనే దఫదఫాలుగా 137 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అయితే ఇంట్లో వాళ్లెవరూ ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇటీవల ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు నగలు ధరిద్దామని నగలపెట్టె ఓపెన్ చేసి  చూడగా బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దర్యాప్తులో ఇంటి దొంగ బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.   రాజేంద్రనగర్ కంచన్ బాగ్  పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్  అనే వ్యక్తి గత నెల   31న కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో తమ ఇంట్లో బంగారం చోరీ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 17న ఆయన భార్య, కుమార్తె బంగారు ఆభరణాలను బీరువాలో భద్రరిచారు. ఆ తరువాత గత నెల 29న ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు ఆభరణాలు ధరించేందుకు బీరువాలోని నగల పెట్టె తెరిచి చూశారు. బంగారు నగలు కనిపించకపోవడంతో  గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి నగలు చోరీ చేశారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు  కానీ ఇంటి పరిసరాలు, కుటుంబ సభ్యుల కదలికలు, ఫోన్ కాల్ వివరాలను విశ్లేషించి విషయం తేల్చేశారు. బంగారు ఆభరణాలు చోరీ చేసినది మహ్మద్ షరీఫ్ కుమారుడు  అద్నాన్ షరీఫ్  అని తేల్చాడు.    తన ఇద్దరు స్నేహితులు మహ్మద్ రెహాన్ ఉద్దీన్ (25), మహ్మద్ సమీర్ (22)లతో కలిసిచోరీకి పాల్పడినట్లు గుర్తించారు.  

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి  , జనవరి నుంచి నాలుగు సార్లు ఇంట్లో ఎవరికీ తెలియకుండా నగలను  దొంగిలించాడని తేలింది పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 137 గ్రాముల బంగారు ఆభరణాలు,
4 సెల్ ఫోన్లు,ఒక వెర్నా కారు స్వాధీనం చేసుకున్నారు. 

By
en-us Political News

  
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో డాలర్ భవిష్యత్తుపై చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బ్రెజిల్, చైనా వంటి దేశాలు తమ పరస్పర వాణిజ్యం కోసం డాలర్‌ను పక్కన పెట్టి, సొంత కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి గనుక మరో ఐదేళ్ల పాటు కొనసాగితే.. ప్రపంచ దేశాలకు అమెరికా డాలర్‌తో అవసరం తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది.
వచ్చే 5 సంవత్సరాల్లో అనేక దేశాలు డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. అదే కనుక జరిగితే.. అమెరికా ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే శక్తి గణనీయంగా తగ్గిపోతుంది.
గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సుదీర్ఘంగా మూడు నెలల పాటు పరిశీలించి, అది తప్పుడు కేసు అని తేల్చిచెప్పిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించగానే కేవలం తొలి రోజే ఆ తీర్పును పక్కనపెట్టేలా జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యవహరించారని ఆరోపించారు. కేవలం మూడు విచారణలతోనే నిందితులందరినీ అవినీతిపరులుగా ముద్ర వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండి, ఆర్థికంగా వెనుకబడిన లేదా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విధుల్లో చేరకముందే ఈ బాధితులను గుర్తించి, ఒక పద్ధతి ప్రకారం వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
మానసిక , మతపరమైన ఒత్తిడికి గురి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఒకటని కాదు.. పలు విధానాల ద్వారా బాధితులను వీరి వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. హిందూ ధర్మంపై విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు, ఆహారపు అలవాట్లలో బలవంతపు మార్పులు అంటే బీఫ్ తినమని ఒత్తిడి చేయడం, అలాగే మతాచారాలను మార్చుకోవాలని అంటే నమాజ్ చేయమని తీవ్ర ఒత్తిడి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ప్రచారంపై హైడ్రా అధికారులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసు పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు తప్పుడు సమాచారం చేస్తున్నారని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే మహిళ బస్సు కింద పడి పోయినప్పటికీ, డ్రైవర్ ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె ఘటనాస్థలంలోనే కన్నుమూసింది.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లక్షల కోట్ల రూపాయల నష్టం అనే అంకెకు సంబంధించి ఏ ప్రభుత్వ సంస్థ లేదా కాగ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నివేదికను విడుదల చేయలేదు.
సామాజిక మాధ్యమంలో పోస్టుల ప్రకారం.. 2004–2014 మధ్య భారీ స్థాయిలో ఖనిజ ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. మోనాజైట్ వంటి థోరియం కలిగిన ఖనిజాలు విదేశాలకు తరలించబడ్డాయి. దీని వల్ల దేశానికి లక్షల కోట్ల నష్టం జరిగింది. థోరియం ఆధారిత అణు సాంకేతికతను ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారు. అన్న తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇప్పటి వరకూ ఏ సీజన్ లోనైనా ఎస్ఆర్ హెచ్ సాధించిన విజయాలన్నీ ఆ జట్టు బ్యాటింగ్ బలంతోనే. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటంతో ఆ జట్టు 200 పరుగుల పై చిలుకు స్కోరును కూడా కాపాడుకోలేక చతికిల పడిన సందర్భాలున్నాయి. అటువంటి ఎస్ఆర్ హెచ్ సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ ప్రదర్శన వల్లనే భారీ విజయం నమోదు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య విభేదాలు పొడసూపినట్లు మైదానంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరియు సీట్ల పెంపు అంశంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.