ఎస్సీ ఎస్టీ బిల్లు...టిడిపి బుట్టలో జగన్ పార్టీ
Publish Date:Dec 3, 2012
Advertisement
నిన్న అర్థరాత్రి వరకు జరిగిన శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలు కూడా ఊహించని విదంగా ఎస్సీ. ఎస్టీ బిల్లుపై ఇర్రుకొని బయట పాడేందుకు నానా తంటాలు పడ్డాయి. రోజంతా వాడిగా వేడిగా సాగిన సమావేశాలతో సభలో సభ్యులు ప్రజలకోసం చలికాలంలో కూడా చెమటలు కక్కుతూ మరీ తమ ఉపన్యాసాలతో సభని హోరేత్తించేసారు. ఇక బిల్లు సభ ఆమోదం పొందడమే తరువాయి అనుకొంటుండగా, తె.దే.ప. బిల్లులో 12వ క్లాజుపై సవరణ ప్రతిపాదించడంతో అసలు డ్రామా మొదలయింది. అంతవరకూ ఆ బిల్లు తెచ్చిన కీర్తి తన ఖాతాలో జమ చేసుకోవాలనుకొని తహతహలాడిన కాంగ్రెస్, తె.దే.పా. ప్రతిపాదనతో ఒక్కసారిగా సభలో కంగుతింది. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తె.దే.ప. ప్రతిపాదనని యెంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, సభాద్యక్షుడు నాదెండ్ల మనోహర్ తె.దే.ప. కోరిన విదంగా బిల్లుపై ఓటింగ్ కి అనుమతించడంతో ముఖ్య మంత్రి మరోసారి కంగుతిన్నట్లు కనిపించేరు. తీవ్ర ఉద్రిక్తతకిలోనయిన ఆయన స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు కూడా. కాని సభలో ఓటింగ్ తప్పలేదు.
తాము ప్రతిపాదించిన సవరణలకు మద్దతుగా సభలో అన్ని ప్రతిపక్ష పార్టీలు నిలబడేసరికి తె.దే.పా. కాంగ్రెసును ఓడించడం ఇక చాల తేలిక అని భావించింది. గాని, వై.యస్.ఆర్. కాంగ్రేసుకు చెందిన విజయమ్మ కొంచెం తతపటాయిన్చుతూ తె.దే.పా. ప్రతిపాదనకి మద్దతుగా లేచినిలబడగానే సభలో కొంచెం గందరగోళం ఏర్పడింది. దానితో మొదట తీసిన లెక్కని పక్కని బెట్టి స్పీకర్ మళ్ళీ మరోసారి వోటింగ్ నిర్వహించినప్పుడు తె.దే.ప. ప్రతిపాదనకి అనుగుణంగా 47 ఓట్లు, దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రేసు సభ్యులు వేసిన 69 ఓట్లూ పోలవడంతో సభలో తె.దే.ప. ప్రతిపాదన వీగిపోయింది. దీనితో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది ముఖ్యమంత్రికి. కాంగ్రెస్ ని ఇరికిన్చామనుకొన్న తే.దే.పా. మరియు విపక్షాలు కాంగ్రేసు చేత యస్సీ ఎస్టీ వ్యతిరేకులుగా ముద్ర వేయించుకొని దొరికిపోయారు.
http://www.teluguone.com/news/content/-tdp-sc-st-bill-23-19483.html
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.
ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.
గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది.
అసలే పోర్న్ స్టార్..ఇక జిస్మ్ల్ చిత్రంలో తన అందాలతో యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. అలాంటి పోర్న్ స్టార్ డిసెంబరు 31న ఓ వేదిక మీద డాన్స్ చేయాలంటే మాటలా. తన ఫాలోయింగ్ ను బట్టి తను కూడా ఉంటుంది. అందం ఉన్నప్పుడు చూపిస్తేనే ఎవరయినా చూస్తారు.
అమెరికాకు చెందిన యువతి ఒలీవియా కల్ఫో మిస్ యూనివర్స్-2012గా ఎంపికయ్యారు. ఫిలిప్పిన్స్, వెనిజులాకు చెందిన యువతులు మిస్ యూనివర్స్ పోటీల్లో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. భారత్కు చెందిన అందాల సుందరి శిల్పాసింగ్ టాప్-16వరకు వచ్చి నిలిచిపోయారు.
ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాదుల కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలకు అక్కడ విలువ లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
మాజీ ఎం ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్ధిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నం కు చెందిన బాలరాజ్, భాగ్యలతల మొదటి కుమార్తె నిఖిత బికాం చదువుతూ, సిఏ కోచింగ్ తీసుకొంటోంది. బుధవారం సాయంత్రం రాఘవేందర్ ఆమె ఇంట్లోకి వచ్చి గొంతు కోసి చంపాడు.
నా తండ్రి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టి ఒక్కదాన్నే క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన నాకు లేదు. నా తమ్ముడు బాలకృష్ణ అన్న మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఎన్టీఆర్ విగ్రహం అందరం కలిసి ఇద్దామని నా ఇంటికి వచ్చింది నిజమే. అయితే కుటుంబ సభ్యులు రాసిన లేఖ మీద సంతకం చేయాలని నన్ను అడగలేదు.





