కార్పొరేట్ ముసుగులో వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం

Publish Date:Apr 17, 2026

Advertisement

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్కి చెందిన నాసిక్ బిపిఓ యూనిట్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాల్లో మహిళా భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న వేళ, నాసిక్ మహిళా పోలీసులు నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్ ద్వారా అక్కడ జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి.   లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్,   అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.

ఈ కేసు దర్యాప్తులో నాషిక్ మహిళా పోలీసులు  అత్యంత సాహసోపేతంగా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి ఆధారాలతో సహా బయటపెట్టారు.  సుమారు ఏడెనిమిది మంది మహిళా కానిస్టేబుళ్లు సాధారణ ఉద్యోగులుగా, హౌస్ కీపింగ్ సిబ్బందిగా వేషాలు మార్చుకుని టీసీఎస్ యూనిట్‌లోకి ప్రవేశించారు. దాదాపు రెండు నుంచి మూడు వారాల పాటు అక్కడే ఉండి, కార్యాలయంలోని పరిస్థితులను, మహిళా ఉద్యోగులపై జరుగుతున్న మానసిక,  శారీరక వేధింపులను వారు ప్రత్యక్షంగా గమనించి, ఆధారాలు సేకరించారు.

ఈ అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా సేకరించిన పక్కా ఆధారాలతోనే పోలీసులు  నిందితులకు ఉచ్చు బిగించారు.  ఈ కేసులో ఒక పద్దతి ప్రకారం నేరాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్నించారు. ముఖ్యంగా చిన్న పట్టణాల నుండి మొదటిసారి కార్పొరేట్ ఉద్యోగాల్లోకి వచ్చే హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ గూమింగ్ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు తేచ్చారు. హెచ్ఆర్, టీమ్ లీడ్ స్థాయిల్లో ఉన్న కొందరు వ్యక్తులు తొలుత మార్గదర్శకత్వం పేరిట యువతులకు దగ్గరై, ఆపై వారిని మానసిక ఒత్తిడికి గురిచేసి లైంగికంగా వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే  ఇమ్రాన్  అనే వ్యక్తి వీడియో కాల్స్ ద్వారా యువతులకు బ్రెయిన్ వాష్ చేస్తూ మత మార్పిడికి ప్రేరేపిస్తున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటివరకు లైంగిక దాడికి సంబంధించి 9 కేసులు, బలవంతపు మత మార్పిడికి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్న కొద్దీ మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయనీ..  త్వరలోనే మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కేవలం స్థానిక నేరస్తులే కాకుండా, విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను మలేషియా వంటి దేశాలకు తరలించే ప్రణాళిక ఉందా అన్న  కోణంలో దర్యాప్తు సాగుతోంది.

మరోవైపు ఈ ఘటనపై కార్పొరేట్ బాధ్యతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం యాజమాన్య వైఫల్యమేనన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  సంస్థలోని అంతర్గత మహిళా భద్రతా కమిటీలు  ఏం చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుపై దృష్టి సారించాయి, ముఖ్యంగా టెర్రర్ ఫండింగ్ వంటి కోణాలు  ఉన్నాయా అన్న కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.

మరో వైపు రాజకీయంగా కూడా ఈ అంశం వేడెక్కింది. గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేశారని.. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాల  ద్వారా నిజాలను వెలికితీస్తోందని బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగులుస్తున్నాయి.   కార్పొరేట్ కార్యాలయాల్లో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు, ఇలాంటి గూమింగ్ ముఠాల ఆటకట్టించడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

By
en-us Political News

  
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.