తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్హౌజ్ పర్యటనకు పిలుపునివ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్నెపల్లి పంప్హౌజ్ వైపు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడుగడుగునా బారికేడ్లు, ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పర్యటనను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష శ్రేణులు మండిపడుతున్నాయి.
హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు సాగిన కేటీఆర్ కాన్వాయ్ను జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య నిలిపివేశారు. హైవేపై భారీగా బారికేడ్లు ఉంచి కేటీఆర్ వాహనాలను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజాప్రతినిధుల పర్యటనను ఎలా అడ్డుకుంటారని గులాబీ నేతలు అధికారులను నిలదీశారు. పెంబర్తి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు, బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో జాతీయ రహదారి ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది.
ఈ పర్యటనను నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, చివరకు కన్నెపల్లి పంప్హౌజ్ వైపు వెళ్తున్న రైతుల వాహనాలను సైతం పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లలో వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ అధికారికంగా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పర్యటనలు చేసే హక్కును కూడా కాలరాస్తున్నారని, కన్నెపల్లి పంప్హౌస్ వాస్తవాలను ప్రజలకు తెలియకుండా దాచడానికే ప్రభుత్వం ఈ స్థాయి ఆంక్షలు విధిస్తోందని ఆరోపించింది. హైదరాబాద్-వరంగల్ హైవే పొడవునా పోలీసులు పహారా కాస్తుండటంతో ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ పర్యటన ముగిసేవరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-ktr-kaleshwaram-tour-36-225099.html
మే 8న హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.