అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రపన్నిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ట్రంప్ ఇరాన్పై తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ఇందుకు కారణం ట్రంప్ను భౌతికంగా అంతమొందించేందుకు ఇరాన్ భారీగా నిధులు కేటాయించిందన్న నిఘా వర్గాల సమాచారమే. ట్రంప్ హత్యకు ఇరాన్ పకడ్బందీ స్కెచ్ వేసిందన్న గూఢచారి వర్గాల హెచ్చరికలతో అమెరికా రక్షణ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
గతంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి. ఈ నిఘా సమచారం నేపథ్యంలో ట్రంప్ అధికారిక విమానమైన ఎయిర్ ఫోర్స్ వన్ భద్రతను కనీవినీ ఎరుగని అత్యున్నత స్థాయికి పెంచారు. శతృదేశాల నుంచి వచ్చే ఎలాంటి క్షిపణి దాడులనైనా తిప్పికొట్టేలా ఈ అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థలను అమర్చారు.
కేవలం విమానంలోనే కాకుండా, ట్రంప్ పర్యటించే ప్రతి ప్రాంతంలోనూ రక్షణ వలయాన్ని 300 శాతానికి పైగా పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ కాన్వాయ్లో తిరిగే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఆకాశంలో నిరంతరం నిఘా ఉంచే డ్రోన్లు, ప్రైవేట్ స్నైపర్ల మోహరింపును గతంతో పోలిస్తే రెట్టింపు చేశారు. ట్రంప్ బహిరంగ సభలలో ప్రసంగించే వేదికల చుట్టూ ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్లను రక్షణగా ఏర్పాటు చేస్తున్నారు. శత్రువులకు ఏ ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదపి యూఎస్ సీక్రెట్ సర్వీస్ విభాగం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది.
ఇరాన్ పన్నుతున్న ఈ కుట్రలపై అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు 100 కు పైగా పేజీలతో కూడిన రహస్య డాక్యుమెంట్ను సిద్ధం చేశారు. ఇరాన్ నిధులు పొందుతున్న కొన్ని విదేశీ ముఠాలు అమెరికా గడ్డపైనే ట్రంప్ కదలికలను నిశితంగా గమనిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ ముప్పు సంకేతాలపై ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఇరాన్ గనుక అలాంటి సాహసానికి ఒడిగడితే ఆ దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ఇలాంటి గ్లోబల్ థ్రెట్ను ఎదుర్కోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ కుట్రలను తిప్పికొట్టేందుకు అమెరికా సైన్యం దాదాపు 24 గంటలూ హై అలర్ట్లో ఉంటూ సరిహద్దులను, గగనతలాన్ని డేగకన్నుతో పర్యవేక్షిస్తోంది.
Iran Assassination Threat, Air Force One Security, US Intelligence Report, Secret Service High Alert, Iran US Conflict
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-plot-to-assassinate-trump-36-225529.html
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జూలై 9 గురువారం నాడు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ సహా ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ పసిడి తాజా రేట్లను ఇక్కడ తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త EPS Scheme 2026 తో ఉద్యోగుల పెన్షన్ విధానంలో భారీ మార్పులు జరిగాయి. కేవలం 20 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్, ఆలస్యమైతే 12% పెనాల్టీ వడ్డీతో పాటు పాత స్కీమ్ EPS 1995 కు మరియు కొత్త విధానానికి గల ముఖ్యమైన తేడాలను ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.