హర్మూజ్ లో ఇరాన్ దాడులు.. ఇండియన్ మృతి.!

Publish Date:Jul 14, 2026

Advertisement

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ముఖ్యంగా హర్మూజ్ ఒక యుద్ధ భూమిగా మారింది. హర్మూజ్ జలసంధిలో  ఇరాన్ జరిపిన  క్షిపణి దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.  యూఏఈ కి చెందిన రెండు చమురు నౌకలపై ఇరాన్ జరిపిన దాడిలో  ఒక మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులలో ఆరుగురు ఇండియన్స్ కాగా, ఇద్దరు  ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. కాగా ఈ దాడి పట్ల ప్రపంచ దేశాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  

ఒమన్ ప్రాంతీయ జలాల పరిధిలో మొంబాసా ,  అల్ బహియా అనే రెండు యూఏఈ చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ  దాడిని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను, నౌకాయాన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది.   ఈ  దాడికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని  హెచ్చరించింది.ఈ క్షిపణి దాడి జరిగిన కొద్దిసేపటికే రంగంలోకి దిగిన అమెరికా సేనలు ఇరాన్‌పై వైమానిక దాడులను  ఉధృతం చేశాయి. ఇరాన్ దాడుల సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా దెబ్బతీసేందుకు తాము సరికొత్త ఆపరేషన్ ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

 హర్మూజ్ జలసంధిని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకుని, దిగ్బంధాన్ని కఠినతరం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.  హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణ బాధ్యతను అమెరికా చూసుకుంటున్నందున, దానికి ప్రతిఫలంగా ఆయా నౌకల నుంచి  ప్రొటెక్షన్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్ చెప్పారు.ఈ  ఉద్రిక్తతల ప్రభావం గ్లోబల్ మార్కెట్‌పై చూపింది.  అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర7.8శాతం పెరిగి.. బ్యారెల్‌కు 81.92 డాలర్లకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగి ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. 

Iran missile attack Hormuz, UAE oil tankers attacked, Indian crew member killed, US Iran tensions 2026, Brent crude oil price hike, Strait of Hormuz blockade

By
en-us Political News

  
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ ఏజ్, ఫిట్‌నెస్, రికార్డులతో కూడిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన కనెక్టివిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇ ఇదిలా ఉండగా, విమానాశ్రయా నికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆగస్టు 15 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలను కూడా ప్రారంభిం చనున్నారు.  
ఇటీవలే   బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్..  తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెలుగును చంద్రుడు పూర్తిగా అడ్డుకోవడంతో భూమిపైకి సూర్యకాంతి కనిపించకుండా పోయింది.  గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో  ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఈ ప్రాంతాల్లో ఏకంగా 2 నిమిషాల 18 సెకన్ల పాటు   అక్కడి ప్రజలు పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్న అద్భుతాన్ని ఆస్వాదించారు.  
మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగిన సదరు కూల్చివేతలకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి అనుమతులు,  ఉత్తర్వులు ఇవ్వలేదనీ,   తమ శాఖ సమ్మతి లేకుండానే జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ప్రదేశాల్లో హైడ్రా బలగాలు కూల్చివేతలు సాగించాయని కలెక్టర్ హైకోర్టు ధర్మాసనం ముందు వెల్లడించారు. 
అమెరికా సైనిక సామర్థ్యాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం దక్కిందన్న ఆయన తాము ఊహించిన దాని కంటే.. అమెరికా సైన్యం చాలా బలహీనంగా ఉందన్నారు.
గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానం, పాలనా సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక రంగాల్లో చంద్రబాబు చూపుతున్న చొరవ, ఆయన దార్శనికత ఏపీని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తోందన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.