Publish Date:Jun 10, 2026
రాజ్యసభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. అసలు ఎలాంటి తప్పు లేకపోయినా సాంకేతిక కారణాలు వెతికి మరీ నామినేషన్ను రద్దు చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యంపై జరిపిన దాడి అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాగా మీనాక్షీ నటరాజ్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారానికీ, తెలంగాణలోని ఒక సివిల్ వివాదానికీ లింక్ ఉంది. గతంలో తెలంగాణకు చెందిన ఒక మాజీ కార్పొరేటర్ కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాన్ని ఆధారంగా చేసుకుని మధ్యప్రదేశ్లోని రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఓట్ల దొంగతనానికి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ స్థానాలను దక్కించుకోవడానికి సీట్ల దొంగతనానికి' తెగబడిందని విమర్శించారు. కేవలం అపవాదులు సృష్టించి ప్రతిపక్షాల అభ్యర్థులను రేసు నుంచి తప్పుకునేలా చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.
మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరించడాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కాంగ్రెస్ బృందం తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ బృందం ఈసీ అధికారులను కలవకుండా అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, న్యాయం కోసం త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కోర్టులోనే తేల్చుకుంటామని అధికారికంగా ప్రకటించింది.
ఇలా ఉండగా.. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొందరు అంతర్గత నేతలే తమకు స్వయంగా అందించారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన నామినేషన్ రద్దుపై స్వయంగా మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ.. దేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి, ఎలాగైనా ఏకపార్టీ పాలనను స్థాపించాలనే ఏకైక దురాలోచనతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-bjp--stooped-from-stealing-votes-to-stealing-seats-39-222432.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది