పరులను ప్రేమిస్తే ఆయుష్షు పదిలం

Publish Date:Dec 24, 2016

Advertisement

‘‘Thou shalt love thy neighbour as thyself," నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని ప్రేమించు- అన్నది క్రైస్తవంలోని ప్రధాన సూక్తులలో ఒకటి. ఈ మాటను కనుక అంతా పాటిస్తే ప్రపంచశాంతి సాధ్యమన్నది పెద్దల ఆశ. అంతేకాదు! పరులను ప్రేమిస్తే ఆయుష్షు కూడా పెరుగుతుందన్నది ఇప్పుడు పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

 

మూడు దేశాలు
ఇతరులకు సాయం చేయడానికి ఆయుష్షుకీ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించేందుకు స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పరిశోధకులు కొందరు ఒక్క తాటి మీదకు వచ్చారు. తమ ప్రయోగం కోసం వారు 1990 నుంచి 2009 వరకు Berlin Aging Study పేరుతో సాగిన ఓ అధ్యయనాన్ని పరిశీలించారు. వీరిలో ఒక 500 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ 500 మంది కూడా 70 నుంచి 103 ఏళ్ల వయసులోపువారే! వీరి వయసుతో పాటుగా ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు వంటి అంశాలన్నింటినీ కూడా పరిశోధకులు పరిగణలోకి తీసుకున్నారు.

 

మూడు రకాలు
తాము పరిశీలిస్తున్న వృద్ధులను వీరు మూడు రకాలుగా విభజించారు. ఒకటి- పిల్లలతోనూ, మనవళ్లతోనూ గడుపుతూ వారికి సాయపడేందుకు ఇష్టపడేవారు. రెండు- పిల్లలు, మనవలు ఉన్నా కూడా వారికి దూరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. మూడు- సొంత పిల్లలు కానీ మనవలు కానీ లేకపోయినా కూడా, తమ సమీపంలో ఉన్న ఎవరో ఒకరికి సాయపడుతూ ఉండేవారు.

 

మూడు ఫలితాలు
ఇంట్లో పెద్దలు చేదోడువాదోడుగా ఉంటూ కష్టసుఖాలను గమనించుకుంటూ ఉంటే... అది ఇంట్లోవారికి లాభం చేకూరుస్తుందన్న విషయం తెలిసిందే! కానీ ఆశ్చర్యంగా ఆ పెద్దల ఆయుష్షుకి కూడా బలం చేకూరుతుందని ఈ ఫలితాలు తేల్చాయి. తమ పిల్లలకి, మనవలకి చేదోడువాదోడుగా ఉన్న పెద్దలు ఏకంగా ఐదేళ్లు ఎక్కువకాలం బతుకుతారని బయటపడింది. అంతేకాదు! తమ సొంతవారు కాకపోయినా పరులకు సాయపడుతూ ఉండేవారు కూడా ఓ మూడేళ్లు ఎక్కువకాలం జీవిస్తారనీ ఈ పరిశోధన తేల్చింది.

 


ఇతరులకు చేదోడువాదోడుగా ఉండాలనే మనస్తత్వం మన హార్మోన్ల మీదా, నాడీ వ్యవస్థ మీదా సానుకూల ప్రభావం చూపుతుందట. అందుకే ఇలాంటి తత్వం ఉన్నవారు తమకి నా అన్నవారు లేకపోయినా కూడా ఎవరో ఒకరికి సాయపడేందుకు సిద్ధంగా ఉంటారట. అయితే ఒక స్థాయికి మించి అవతలవారి జీవితాలలోకి చొచ్చుకుపోతే మాత్రం ఒత్తిడి తప్పదని హెచ్చరిస్తున్నారు.

 

- నిర్జర.

By
en-us Political News

  
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.