‘ఆంధ్రోడు’ అనొద్దన్న ఆర్.నారాయణమూర్తి
Publish Date:Dec 23, 2012
Advertisement
ఆంధ్రా ప్రజలను ఉద్దేశించి ‘ఆంధ్రోడు’ అని సంభోదించవద్దని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు,నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. నిన్న హైదరాబాద్ లో ప్రజా కళాకారిణి విమల ఫై అక్రమ కేసులను నిరసిస్తూ ధూమ్ ధూమ్ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలకు కూడా ఆత్మ గౌరవం ఉంటుందని, వారిని ఉద్దేశించి ‘ఆంధ్రోడు’ అనే పదాలు వాడవద్దని తెలంగాణా ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. విమలఫై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, తెలంగాణా భాషను పట్టించుకోని ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు. తెలంగాణా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అసలు సిద్దంగా లేదని, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి ఆ పార్టీనేనని ఈ సమావేశంలో పాల్గొన్న గద్దర్ అన్నారు. తెలంగాణా ఉద్యమం అనేది సాంస్కృతిక ఉద్యమమని, ఇది రాజకీయ ఉద్యమం మాత్రమే కాదని ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణా భావానికి అధిక ప్రచారం రావడంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు వివేక్ మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని వర్గాలు కలిసి పోరాడాల్సి ఉందని అన్నారు. టిఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ, ఆంధ్ర ప్రజలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారని ఆర్టిసి గుర్తింపు సంఘ ఎన్నికల ఫలితాలు రుజువు చేసాయని అన్నారు. తెలంగాణా జెఏసి చైర్మన్ కోదండ రామ్, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.
http://www.teluguone.com/news/content/--vimala-false-cases-24-19962.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





