మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కేకు ఎదురుగాలి?

Publish Date:May 11, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా కొందరు వైసీపీ నేతల మాటల్ని బట్టి, సీఎం జగన్ పార్టీ నేతలతో చేస్తున్న సమీక్షలు, ఇప్పటి నుంచే వారికి పార్టీ పరంగా అప్పజెబుతున్న బాధ్యతల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతి ప్రాంతంలో ముఖ్యమైన, చారిత్రక మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి గడ్డుకాలం ఎదుర్కోక తప్పదనే అంచనాలు వస్తున్నారు. ఆర్కే 2014లో తొలిసారిగా వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై 5 వేల 337 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్ డీఏ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

అయితే.. మంగళగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గం ప్రజలకు ఆర్కే చేసిన మేలు ఏమిటనేది చూస్తే.. అతి స్వల్పమే అంటారు స్థానికులు. నియోజకవర్గం బాగోగుల గురించి అంతగా పట్టించుకోని ఆర్కే.. ఎంతసేపూ సీఆర్ డీఏ చైర్మన్ హోదాలో అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఫిర్యాదులు చేయడానికే సమయం అంతా వెచ్చిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి భూముల విషయంలో ప్రతినిత్యం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పైన, టీడీపీ హయాంలో మున్సిపల్ మంత్రిగా వ్యవహరించిన పొంగూరు నారాయణపైన ఆరోపణలు చేయడం, ఫిర్యాదులు చేయడంపైనే ఉంటారని చెబుతారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాము సంతోషంగా తమ భూములు ఇస్తే.. చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారంటూ ఆర్కే ఆరోపణలు చేయడం సరికాదని కొందరు దళితులు ఖండించడం విశేషం. దళితులను అవహేళన చేస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని దళితులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనూహ్య పరిణామమే. ఆర్కేకి నిజంగా మంగళగిరిపై, దళితులపై ప్రేమ ఉంటే.. అమరావతిని అభివృద్ధి చేసి చూపించాలనేది దళితుల సవాల్. అమరావతి నిర్మాణం కోసం రైతుల భూమిని బలవంతంగా లాక్కున్నారన్న ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలను పలువురు రాజధాని ప్రాంత రైతులు కూడా ఖండించడం గమనార్హం. అమరావతి భూముల విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే రాజకీయం చేస్తున్నారని వారు తూర్పారపడుతుండడం గమనించదగ్గ విషయం.

ప్రతినిత్యం వైసీపీ అధినేత వైఎస్ జగన్ భజనతోనే ఎమ్మెల్యే ఆర్కే తరిస్తుంటారని, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో ఆయన చేసిందేమీ లేదని ప్రజలు పెదవి విరుస్తుండడం విశేషం. ఒకసారి గెలిపిస్తే.. ప్రతిపక్షంలో ఉండడం వల్లే అభివృద్ధి చేయలేకపోయారని సరిపెట్టుకున్నామని, ఈ సారి అధికారపక్షంలో ఉన్నా ఆర్కే తమకేమీ ఒరగబెట్ట లేదని వారు ప్రత్యక్షంగానే వారు విమర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగినా.. లేదా ముందుగా జరిగినా.. ఆర్కే గెలిచే పరిస్థితి ఉండబోదని స్థానికులే చెబుతుండడం గమనార్హం.

మరో పక్కన ఈ సారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేయాలని టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ డిసైడ్ అయ్యారనే అంచనాలే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్లుగా మంగళగిరిలోనే అనునిత్యం గడుపుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి నియోజకవర్గంలో ఏడో ఒక చోట ప్రజల మధ్య లోకేష్ ప్రత్యక్షం అవుతున్నారు. ‘పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి’ అన్న లోకోక్తి ప్రకారం గతంలో మంగళగిరిలోనే ఓడిన నారా లోకేష్ ఇదే నియోజకవర్గంలో రెట్టించిన పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఎవరికి ఏమి కష్టం వచ్చినా.. వెంటనే అక్కడ వాలిపోతున్నారు. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను, సీఎం జగన్ ను నిలబెట్టి కడిగేస్తున్నారు. గతంలో తానెవరో నియోజకవర్గం ప్రజలకు అంతగా తెలియకపోయినా సిటింగ్ ఎమ్మెల్యే ఆర్కేకు గట్టి పోటీనే ఇచ్చారు. వారిద్దరి మధ్యా ఓట్ల తేడా స్వల్పమే. ఇప్పుడు నియోజకవర్గం ప్రజల మధ్యే నిరంతరం ఉండడంతో లోకేష్ అంటే మరింత క్రేజ్ వచ్చిందంటున్నారు.

గత ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆర్కే పేదలకు 4 రూపాయలకే భోజనం, 10 రూపాయలకే సంచి నిండా కూరగాయలు లాంటి టక్కు టమార విద్యలు ప్రదర్శించారంటారు. అయితే.. రెండోసారి గెలిపించిన ప్రజలకు ఆర్కే జనాలకు అవసరమైన కార్యక్రమాలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ముందు ఆర్కే ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అసలు నియోజకవర్గంలోనే కనిపించడంలేదని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే స్థానిక ఎమ్మెల్యేగా ఆర్కే ఏ మాత్రం స్పందించడం లేదని, ఎమ్మెల్యే మిస్సయిపోయారంటూ లోకేష్ చేస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందనేది జనం మాటగా ఉంది. నియోజవర్గాన్ని చుట్టేస్తున్న లోకేష్.. గత ఎన్నికల్లో తనకు పెద్దగా ఓట్లు పడని ప్రాంతాలపై మరింతగా దృష్టి సారించి పనిచేసుకుపోతున్నారు.

ఇటీవలే జరిగిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల సందర్భంగా మహిళా అభ్యర్థిని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్ చేయించారని మీడియాలో వార్తలు రావడం ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిందంటున్నారు. దుగ్గిరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ పై ఆళ్ల డ్రైవర్ రాళ్ల దాడి చేయించిన సంఘటనతో ఆర్కేపై నియోజవర్గం ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చిందంటున్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే చేసుకున్న స్వయం కృతం, నారా లోకేష్ ప్రజల మధ్యకు దూసుకుపోతున్న కారణంగా ఈ సారి ఎన్నికల్లో ఆర్కేకు గడ్డు పరిస్థితులు తప్పవనే రాజకీయ విశ్లేషకుల అంచనా.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.