పిల్లల్ని చంపాక గుడికి వెళ్దామన్నాడట...

 

ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన భార్యతో వున్న విభేదాల కారణంగా తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సైకో తన పిల్లలను చంపిన తర్వాత భార్య దగ్గరకి వచ్చి గుడికి వెళ్ళి వద్దాం అన్నాడట. ఈ విషయాన్ని ఆయన భార్య సుహాసిని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పింది. తన ఇద్దరు పిల్లలను ఇంట్లోంచి తీసుకెళ్ళిన గురుప్రసాద్ ఒక్కడే తిరిగి వచ్చాడని, పిల్లల గురించి అడిగితే చెప్పలేదని ఆమె తెలిపింది. పిల్లలను చంపి వుంటాడని తాను ఊహించలేకపోయానని ఆమె గుండెలు అవిసేలా రోదిస్తూ చెబుతోంది. పాతిపెట్టిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు మంగళవారం బయటకి వెలికి తీసి గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పెద్ద కొడుకు మెడపై రెండు, చిన్న కొడుకు మెడపై మూడు కత్తిపోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.