మహేష్‌ కొత్త మూవీ టైటిల్ ‘మగాడు’ కాదట.

 

మహేష్‌ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ‘మిర్చి’ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మిస్తున్న చిత్రం చిత్రం పేరు ‘మగాడు’ అని పెట్టనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి ‘మగాడు’ అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాతలు చెబుతున్నారు. ‘‘మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని టైటిల్స్‌ వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఈ చిత్రానికి టైటిల్‌ నిర్ణయించలేదు. టైటిల్‌ నిర్ణయించిన తర్వాత అధికారికంగా మేమే ప్రకటిస్తాం. మా సంస్థలో మొదటి చిత్రమే సూపర్‌స్టార్‌ మహేష్‌గారితో చెయ్యడం మా అదృష్టం. మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేశాం’’ అని  చిత్ర నిర్మాతలు చెప్పారు.