అన్ని పాఠశాలలకు వైఫై సౌకర్యం అందిస్తాం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించారు. దీనిలో భాగంగా ఆయన అక్కడ నిర్వహించిన 'బడి పిలుస్తోంది' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్నిపాఠశాలలకు వైఫై సౌకర్యం అందిస్తామని.. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలని అన్నారు. ఇకనుండి విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని.. రాష్ట్రాన్ని ఓ నాలెడ్జ్ హబ్ గా మారుస్తానని తెలిపారు. అన్ని శాఖలకంటే విద్యాశాఖకే ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు, విద్యాసంస్థలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు చేకూరుస్తామని స్పష్టం చేశారు.