ఓటీటీలోకి 'భజే వాయు వేగం'...

కార్తికేయ (Kartikeya), ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భజే వాయు వేగం' (Bhaje Vaayu Vegam). ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ సినిమా మే 31న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ నే తెచ్చుకున్న ఈ మూవీ.. త్వరలో ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.

'భజే వాయు వేగం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయిందని తెలుస్తోంది. జూన్ 28 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో అడుగుపెడుతోంది అన్నమాట. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

రధన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఆర్‌.డి. రాజశేఖర్‌, ఎడిటర్ గా సత్య. జి వ్యవహరించారు.