రాజమౌళి పార్ట్ 2 చెయ్యలేదని మృణాల్ ఠాకూర్ కి తెలుసా!

మృణాల్ ఠాకూర్(mrunal thakur)సీతారామంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుని హాయ్ నాన్న తో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.  భారీ ఫ్యాన్  బేస్ ని కూడా లాక్ చేసుకుంది.  అది ఎంతలా అంటే తన అప్ కమింగ్ మూవీస్    గురించి ఎంక్వయిరీ చేసేంతలా.  ఈ నేపథ్యంలో ఆమె ఒప్పుకున్న కొత్త మూవీ తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకర్షిస్తుంది.

2012 లో బాలీవుడ్  ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సన్ ఆఫ్ సర్దార్( son of sardaar)అజయ్ దేవగన్ హీరోగా సంజయ్ దత్ విలన్ గా చేసారు.  హీరోయిన్ గా సోనాక్షి సిన్హా స్క్రీన్ షేర్ చేసుకుంది. మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి  సీక్వెల్ తెరకెక్కబోతుంది. సన్ ఆఫ్ సర్దార్ 2 అనే టైటిల్ తో రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఎంపిక అయ్యింది. సోనాక్షి స్థానంలో మేకర్స్ ఆమెని ఎంపిక చేసారు. మిగతా నటీనటులంతా మొదటి భాగంలో చేసిన వాళ్లే.  మృణాల్ ఆ మూవీని  ఒప్పుకుంటే తెలుగు సినిమా ప్రేక్షకులకి ఎందుకు ఆనందం. ఒక వేళ హిందీతో పాటు  తెలుగులో కూడా ఒకే సారి రిలీజ్ అవుతుందా!  ప్రస్తుత పాన్  ఇండియా ఫీవర్ లో అది కామనే కదా అని అనుకుంటున్నారా! మీరు అనుకున్నట్టు రిలీజ్ అయితే మంచిదే..   

కానీ అసలు విషయం ఏంటంటే ..సన్ ఆఫ్ సర్దార్  మన తెలుగులో సునీల్ హీరోగా రాజమౌళి (rajamouli)దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న కి  రీమేక్. మరి జక్కన్న రెండవ పార్ట్ ని తెరకెక్కించలేదు. కానీ బాలీవుడ్ లో  రెండవ పార్ట్ తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో కథ విషయంలో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మృణాల్ కి సన్ ఆఫ్ సర్దార్ సృష్టికర్త  రాజమౌళి  అని తెలుసో లేదో. మృణాల్  ఇటీవల వచ్చిన ప్రభాస్ (prabhas)కల్కి (kalki)లో ఒక చిన్న క్యారక్టర్ లో మెరిసిన విషయం తెలిసిందే.